ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి..
ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలి..
భీమా ఫౌండేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి..
.jpg)
ఎల్బీనగర్ జూన్ 29 న్యూస్ ఇండియా ప్రతినిధి: భీమా ఫౌండేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ హిల్స్ కమ్యూనిటీ హాల్ లో రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తల సేమియా వ్యాధి తో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం చేయడం ద్వారా చిన్నారుల మొహములో చిరునవ్వులు చూసిన వాళ్ళము అవుతామని ప్రతి ఒక్కరూ తల సేమియా పిల్లలకు అండగా నిలవాలని తెలిపారు బీమా ఫౌండేషన్ తెలంగాణ ఉండ్రాతి రవి, గంటా సతీష్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విట్టల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లా రెడ్డి, ఎల్బీనగర్ సీఐ వినోద్, ఎస్సై ప్రసాద్, బిఆర్ఎస్ యువ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పొచబోయిన జగదీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి, శ్రీరామ హిల్స్ కాలనీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ, స్వామి గౌడ్, సేద్ధిని స్వామి, నర్రి వెంకన్న, దుర్గారావు, మార్తా లక్ష్మణ్, మార్తా సాయి, నిమ్మల భరత్, కావడి నరసింహ, దేవరాయ శివ, స్వప్న, సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.
Comment List