ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

వైద్యుల నిర్లక్ష్యంతో రైతు మృతి..

On
ఓజోన్ హాస్పటల్లో దారుణం.. 

మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ.. ఓజోన్ హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా చేశారు.

ఓజోన్ హాస్పటల్లో

IMG-20250704-WA1329
మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల హాస్పిటల్ ముందు మాకు న్యాయం చేయాలని ధర్నా..

దారుణం.. 

వైద్యుల నిర్లక్ష్యంతో రైతు మృతి..

మృతదేహానికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోపణ..

ఎల్బీనగర్, జులై 04, న్యూస్ ఇండియా ప్రతినిధి: వైద్యుల నిర్లక్ష్యంతో ఒక రైతు మృతి చెందిన ఘటన కొత్తపేట ఓజోన్ హాస్పటల్లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.‌ కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా పెనుపహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన బైరెడ్డి భగవంత్ రెడ్డి (60), భార్య దుర్గమ్మ (50). వృత్తిరీత్యా స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 30వ తేదీన ఒంట్లో నలతగా ఉందని ఎన్టీఆర్ నగర్ లోని ఓజోన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. భగవంత్ రెడ్డి కి పూర్తిగా వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని సూచించారు. అందుకుగాను రూ. 8 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఈనెల 2వ తేదీన ఉదయం సుమారు 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు రెండు దఫాలుగా ఆపరేషన్లు నిర్వహించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దాదాపు 20 యూనిట్ల రక్తాన్ని ఎక్కించి, రెండు రోజులుగా ఎవరిని కూడా ప్రత్యేక చికిత్స విభాగానికి పోకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో బాధిత రైతు కుటుంబ సభ్యుల ఐసీయూలోకి వెళ్లి చూడగా అప్పటికే భగవంత్ రెడ్డి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. రెండు రోజుల క్రితం చనిపోయిన మృతదేహానికి రక్తం ఎక్కించి తమను మోసం చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న చైతన్యపురి పోలీసులు విచారణ చేస్తున్నారు.

Views: 1

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!