ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరే సికిందర్ రెడ్డి..
ఇబ్రహీంపట్నం ఏసిపి కెపివి రాజు, సిఐ మహేందర్ రెడ్డి కి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వెదిరే సికిందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ అధ్యక్షులు...
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జులై 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే, వాటిని ఖండిస్తూ కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఆదివారం ఇబ్రహీంపట్నం ఏసిపి కెపివి రాజు, సిఐ మహేందర్ రెడ్డి కి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యూత్ అధ్యక్షులు వెదిరే సికిందర్ రెడ్డి ఫిర్యాదు

చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో అతనిపై భౌతిక దాడులకు కూడా వెనకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రావుల నాగరాజ్, ఎన్.ఎస్.యు.ఐ ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ మంచాల్ మండలం ఉపాధ్యక్షులు కొల్లోజు విశ్వనాథ్ చారి, ఎన్.ఎస్.యు.ఐ రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుకుడాల నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
Comment List