తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి

తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి

మహబూబాబాద్ జిల్లా:-
తొర్రూరు పట్టణం

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలోని అభ్యాస్ స్కూల్లో చదువుతున్న నల్లగొండ జిల్లా, తిరుమలగిరి మండలం, వెలిశాల గ్రామం మర్రికుంట తండా కు చెందిన బానోత్ వెంకన్న కుమారుడు బానోతు వెంకట చైతన్య అనే విద్యార్థి గత మూడు సంవత్సరాలుగా తొర్రూరు పట్టణం ఇదే స్కూల్లో చదువుకుంటున్నాడు. గత ఆదివారం రోజు రాత్రి ఎలుకల మందు తాగి విద్యార్థి స్పృహ కోల్పోగా స్కూల్ యాజమాన్యం హుటాహుటిన పట్టణ కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స చేయించారు కానీ విద్యార్థి కి సీరియస్ గా ఉందని  యజమాన్యం తెలుపి హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు తీసుకుపొమ్మని చెప్పగా, స్కూల్ యాజమాన్యం మాత్రం తల్లిదండ్రులకు మీ అబ్బాయికి ఫుడ్ పాయిజన్ అయిందని తెలిపి రమ్మని హైదరాబాద్ తీసుకుపోయే క్రమంలో సోమవారం రోజు రాత్రి విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మరణంతో తల్లిదండ్రులు బంధువులు బోరున విలపించి స్కూలు ఆవరణలో విద్యార్థి మృతదేహాన్ని ఉంచి మా కుమారుడు మృతి చెందడానికి స్కూల్ యాజమాన్యమే కారణమని తెలిపారు మా కుమారుని మృతి పట్ల మాకు అనుమానం ఉందని మాకు తగిన న్యాయం చేయాలని విద్యార్థి మృతదేహంతో ధర్నా నిర్వహించారు సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 174
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..