ఎమ్మెల్యేలకు ఎర కేసు

On

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగ్గుస్వామి,తుషార్‌లను వెదికే పనిలో ఉంది సిట్. బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ కోర్టు నుంచి రిలీఫ్ పొందడంతో ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోంది సిట్‌. బీఎల్ సంతోష్‌పై కేసును పూర్తిగా క్వాష్ చేయాలా.. లేక వేరే ఏమైనా ఆదేశాలు ఇవ్వాలా అనేది.. కోర్ట్‌కు సిట్ సమర్పించే ఆధారాలను బట్టి ఉండనుంది. మరోవైపు నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌.. నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ విచారణకు హాజరయ్యారు. 8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు […]

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. జగ్గుస్వామి,తుషార్‌లను వెదికే పనిలో ఉంది సిట్.

బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌ కోర్టు నుంచి రిలీఫ్ పొందడంతో ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తోంది సిట్‌.

బీఎల్ సంతోష్‌పై కేసును పూర్తిగా క్వాష్ చేయాలా.. లేక వేరే ఏమైనా ఆదేశాలు ఇవ్వాలా అనేది.. కోర్ట్‌కు సిట్ సమర్పించే ఆధారాలను బట్టి ఉండనుంది.

మరోవైపు నోటీసులు అందుకున్న న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌.. నందకుమార్‌ భార్య చిత్రలేఖ సిట్‌ విచారణకు హాజరయ్యారు.

Read More అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..

8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు ఇవాళ నందు భార్య చిత్రలేఖ, ప్రతాప్‌ మళ్లీ విచారణకు రావాలని అధికారులు ఆదేశించారు.

Read More రేషన్ దందాపై ‘పిడీ’ కిలి..

నందకుమార్‌కు సంబంధించిన వ్యాపారులు, ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఆయన భార్య చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించారు.

కొన్ని లావాదేవీలు చిత్రలేఖ బ్యాంకు ఖాతాల నుంచి జరిగినట్లు దర్యాప్తులో తేలగా అధికారులు నోటీసులిచ్చి ప్రశ్నించింది.
ఇక తుషార్‌ అండ్‌ జగ్గుస్వామిని ఇంటరాగేట్‌ చేస్తే కీలక ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు అధికారులు. ఈ ఇద్దరే ఈ కేసులో కీ పర్సన్స్‌గా భావిస్తోంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు.. అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..
హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ సమీపంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్ణీత గడువుల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలని హౌసింగ్‌ కార్పొరేషన్‌...
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్
మేడారానికి 25 నుంచి ప్రత్యేక బస్సులు
కార్పొరేషన్ ఎన్నికల ప్రచారజోరు పెంచిన సిపిఐ
ఇంటి నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకోవడమే మా లక్ష్యం
27వ డివిజన్ పోటీ కోసం మద్దెల సుధారాణి దరఖాస్తు
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి భాద్యత