కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరావత్ నాగమణి

On
కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరావత్ నాగమణి

ఖమ్మం, డిసెంబర్ 11 — న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్* ) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో టిడిపి, జనసేన పార్టీ మద్దతుతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ధరావత్ నాగమణి పోటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని నాగమణి పేర్కొన్నారు. ముఖ్యంగా సిసి రోడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, పేదవారికి ఆర్థిక సహాయాలు వంటి పథకాలు గ్రామ ప్రజలకు ఉపయోగపడ్డాయని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించిన ఆమె, మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలవాలని ప్రజలను అభ్యర్థించారు.

Screenshot_20251211-141428_WhatsApp

Views: 8
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు