కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరావత్ నాగమణి

On
కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ధరావత్ నాగమణి

ఖమ్మం, డిసెంబర్ 11 — న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్* ) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జాస్తిపల్లి గ్రామ సర్పంచ్ బరిలో టిడిపి, జనసేన పార్టీ మద్దతుతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ధరావత్ నాగమణి పోటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని నాగమణి పేర్కొన్నారు. ముఖ్యంగా సిసి రోడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు, పేదవారికి ఆర్థిక సహాయాలు వంటి పథకాలు గ్రామ ప్రజలకు ఉపయోగపడ్డాయని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించిన ఆమె, మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో తాను భారీ మెజార్టీతో గెలవాలని ప్రజలను అభ్యర్థించారు.

Screenshot_20251211-141428_WhatsApp

Views: 11
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..