ఒక్క ఓటుతో గెలిచిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా
On
ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) రఘునాధపాలెం మండలం బాధ్యతండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ అభ్యర్థి నునావత్ పెంట్యా ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై హోరా హోరీగా జరిగిన పోటీలో కేవలం ఒక్క ఓటు మెజార్టీతో సంచలనాత్మక విజయం సాధించారు.ఈ ఉత్కంఠభరిత ఫలితం గ్రామ రాజకీయాల్లో చరిత్రగా నిలిచింది.వారు మాట్లాడుతూ.. అధికార పార్టీ వాళ్లు ఎంతో భయభ్రాంతులకు గురిచేసిన తమ నాయకులు,ప్రజలు లొంగిపోకుండా బిఆర్ఎస్ పార్టీని గెలిపించారని అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత దౌర్జన్యానికి దిగలేదన్నారు.ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించారని తనను సర్పంచిగా గెలిపించాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

Views: 4
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Dec 2025 15:36:31
ఖమ్మం డిసెంబర్ 13 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
కొనిజర్ల మండలం ఉప్పలచలక గ్రామ సర్పంచిగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోత్ శారద చందు కాంగ్రెస్ అభ్యర్థి...

Comment List