అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )

On
అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే )

మేరా యువ భారత్ ( మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ) వారి సహకారంతో సయ్యద్ యూత్ క్లబ్ వారు గుడ్ గవర్నెన్స్ డే బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ రఘునాధపాలెం ఖమ్మం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది, ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, సరిత, సయ్యద్ షారుఖ్, షేక్ హనీఫ్ వీరు ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, నాగేశ్వరరావు విద్యార్థులతో మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి మూడు సార్లు భారత ప్రధానమంత్రిగా పనిచేశారని, అటల్ బిహారీ వాజ్పేయి సుపరిపాలనా దినోత్సవం ( గుడ్ గవర్నెన్స్ డే ), మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినమైన డిసెంబర్ 25వ తేదీని భారత ప్రభుత్వం 2014లో సుపరిపాలనా దినంగా ప్రకటించింది, దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వంలో జవాబుదారీతనం, ప్రజలకు మెరుగైన పాలన అందించడం, మరియు వాజ్పేయి దేశానికి చేసిన సేవలను స్మరించుకోవడం. డిసెంబర్ 23, 2014న, వాజ్పేయి మరియు పండిట్ మదన్ మోహన్ మాలవీయాలకు భారతరత్న ప్రకటించిన సందర్భంలో, డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా ప్రకటించారు. జన్మదినం: డిసెంబర్ 25, 1924న జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయికి నివాళి అర్పిస్తూ ఈ రోజును జరుపుకుంటారు. విద్యార్థులతో ప్రసంగించడం జరిగింది, విద్యార్థులకు క్విజ్ నిర్వహించి అందులో మొదటి మరియు ద్వితీయ నగదు బహుమతులు ఇవ్వడం జరిగింది అనంతరం విద్యార్థులతో ర్యాలీ తీయించడం జరిగింది.

Views: 25
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..