వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా

ప్రసన్న కుమార్ ఫ్రెండ్లీ కేర్ చేతుల మీదుగా

On

వృద్ధుల ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
సీతారామపురం వృద్ధాశ్రమంలో ఇనుప పెట్టెల పంపిణీ
దేవరుప్పుల మండలం సీతారామపురంలో ఉన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలను గుర్తించి, మహాత్మ హెల్పింగ్ హాండ్స్ సహకారంతో, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువైన వస్తువులు భద్రపరచుకునేందుకు ఉపయోగపడే ఇనుప పెట్టెలను ఈ రోజు పంపిణీ చేశారు.
వృద్ధాశ్రమంలో నివసిస్తున్న సుమారు 15 మంది వృద్ధులకు తమ విలువైన పత్రాలు, డబ్బు మరియు ఇతర అవసరమైన వస్తువులను సురక్షితంగా దాచుకునేందుకు సరైన పెట్టెలు లేవని తెలిసిన వెంటనే, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ ఈ విషయాన్ని మహాత్మ హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు గంట రవీందర్ దృష్టికి తీసుకెళ్లారు.
అడిగిన వెంటనే స్పందించిన గంట రవీందర్ గారు, తన సొంత ఖర్చులతో ఇనుప పెట్టెలను ఏర్పాటు చేసి వృద్ధాశ్రమానికి పంపించడం విశేషం. ఆయన సేవా భావానికి గుర్తుగా ఈ రోజు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులు వృద్ధాశ్రమానికి చేరుకొని పెట్టెలను వృద్ధులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెదపూడి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ,
“మా గురువు గారైన గంట రవీందర్ గారి సేవా ప్రేరణతోనే ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఏర్పడింది. ఆయన మానవత్వం, సేవా తత్వమే మా సంస్థకు మార్గదర్శకం. వృద్ధుల భద్రత కోసం చేసిన ఈ సహాయం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని తెలిపారు.
వృద్ధులు కూడా ఈ సందర్భంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తమ అవసరాన్ని గుర్తించి సహాయం చేసిన మహాత్మ హెల్పింగ్ హాండ్స్, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.,

Views: 13
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..