55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం

జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన వేముల అశోక్‌ 

On
55వ డివిజన్‌లో జనసేన జోరైన ప్రచారం

గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన

కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో) ఫిబ్రవరి5:కొత్తగూడెం కార్పొరేషన్ 55వ డివిజన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న వేముల అశోక్ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇంటింటి ప్రచారం, కాలనీల్లో సమావేశాలు, ప్రజలతో ప్రత్యక్ష భేటీల ద్వారా అశోక్ విస్తృతంగా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు.డివిజన్‌లో నెలకొన్న తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, రోడ్ల దుస్థితి, పారిశుధ్య సమస్యలపై ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆవేదనను ఆయన నేరుగా వింటున్నారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అశోక్ తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య పనుల మెరుగుదలతో పాటు పేదలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ప్రచార కార్యక్రమంలో అశోక్ మాట్లాడుతూ..“జనసేన పార్టీ సిద్ధాంతాలే నా మార్గదర్శకం. ప్రజలకు జవాబుదారీ పాలన, అవినీతి రహిత పరిపాలన అందించడమే నా లక్ష్యం. 55వ డివిజన్‌ను అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలి” అని అన్నారు.ప్రచారంలో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా యువతలో కనిపిస్తున్న ఉత్సాహం అశోక్ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోందని రాజకీయ వర్గాలు ఆ

IMG-20260205-WA2479భిప్రాయపడుతున్నాయి.మొత్తంగా జనసేన పార్టీ అభ్యర్థిగా వేముల అశోక్ 55వ డివిజన్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తూ, ఎన్నికల ఫలితాలపై ఆసక్తిని మరింత పెంచుతున్నారు.

Views: 16
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News