ఆడబిడ్డను ఆదరించి మున్సిపాలిటీకి పంపించాలని కోరుతూ, తొర్రూరు మున్సిపాలిటీ 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి పంజా కల్పన
మహబూబాబాద్ జిల్లా – తొర్రూరు మున్సిపాలిటీ
ఈ సందర్భంగా పంజా కల్పన మాట్లాడుతూ—
తాను గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సేవాభావంతో పనిచేసినప్పటికీ,
పార్టీలోగానీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ వ్యవహారాల్లోగానీ,
మహిళా సంఘాల కార్యకలాపాల్లోగానీ తన సేవలకు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“పార్టీ కోసం పనిచేసిన మహిళలను పక్కనపెట్టి, వారి సేవలను విస్మరించడం సరైంది కాదు.
ఇది ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఇప్పటి పరిస్థితుల్లో మహిళల గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టిన నాయకత్వంగా
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి,
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిలను పేర్కొంటూ,
వారి ప్రోత్సాహంతోనే తాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచినట్లు తెలిపారు.
9వ వార్డులో తనను గెలిపిస్తే,
మహిళల సమస్యలపై పోరాటం చేస్తూ,
ప్రజలతో కలిసి నిజమైన అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆడబిడ్డకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీకి,
మహిళా నాయకత్వాన్ని గెలిపించే అవకాశం ఇవ్వాలని
వార్డు ప్రజలను పంజా కల్పన విజ్ఞప్తి చేశారు.

Comment List