సౌత్ సెంట్రల్ అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్
ఎస్.ఐ.సాయి ఆధ్వర్యంలో అగ్నిమాపక భద్రతా తనిఖీలు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) ఫిబ్రవరి 21:దక్షిణ మధ్య రైల్వేలో నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్నిమాపక భద్రతా స్పెషల్ డ్రైవ్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా పి.ఎస్.ఆర్ కృష్ణ ఇన్స్పెక్టర్ ఆదేశాల ప్రకారం శనివారం ఆర్పిఎఫ్/భద్రాచలం రోడ్ రైల్వే పార్శిల్ కార్యలయంలో ఎస్.ఐ.సాయి సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించరు. రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పిచడం జరిగింది. అలాగే అగ్నిమాపక యంత్రాల వాడకం మరియు రైల్వేలలో ప్రయాణికులు ఏ వస్తువులను తీసుకెళ్లడం నిషేధించబడిందో వివరించి, అటువంటి చర్యల పర్యవసానాలు మరియు తీసుకోవలసిన శిక్షా, చర్యలను వారికి వివరించారు. స్టేషన్లు, రైళ్లలో అగ్ని ప్రమాదాలను నియంత్రించడం మరియు ఉద్యోగులు మరియు ప్రయాణీకుల అప్రమత్తతను పెంచడం ఈ డ్రైవ్ యొక్క ముఖ్య లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎ.ఎస్.ఐ జి.ఎన్. స్వామి, జేమ్స్ పాల్,కామషల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comment List