పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఘనంగా ఖమ్మం జిల్లా స్థాయి యువ మాక్ పార్లమెంట్' ఉత్సాహం
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా సాగాయి.కేవలం ఓటు వారు వేయడమే కాకుండా దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారి, సభా మర్యాదలను పాటిస్తూ దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై చర్చించారు. ప్రశ్నలు అడగడం,సమాధానాలు చెప్పడం, బిల్లులపై చర్చ వంటి అంశాల్లో తమ ప్రతిభను చాటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ పనితీరు,చట్టాల తయారీ ప్రక్రియపై యువతకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.పార్లమెంటరీ విధానాలపై అవగాహన దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమైనదాని కార్యక్రమ ముఖ్య అతిథి పాల్గొన్న జిల్లా మహిళా ప్రాంగణ సంక్షేమ అధికారినీ వేల్పుల విజేత అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఏ జె రామారావు,ఐ క్యూ ఎ సి కో ఆర్డినేటర్ అసోసియట్ ప్రొఫెసర్ ప్రవీణ్,జ్యూరీ సభ్యులు రాజనీతి శాస్త్ర అధ్యాపకులు బి వెంకటేశ్వర రెడ్డి, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు రవి వర్ధన్,జ్యూరీ సభ్యులు తెలుగు అధ్యాపకులు వెంకటరమణ,మోటివేషనల్ స్పీకర్ తాటిపల్లి సుధీర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్యామల దేవి,రాంకుమార స్వామి,అధ్యాపకులు చేకూరి రమేష్ అసోసియేట్ ప్రొఫెసర్ బొంద్యాల నాయక్,రాజనీతి శాస్త్ర అధ్యాపకులురాలు డాక్టర్ ఎ చరిత్ర అద్దేపల్లి, అధ్యాపకులు పగిడిపల్లి వెంకటేశ్వర్లు, రవిశంకర్వి,ద్యార్థినులు పాల్గొన్నారు.


Comment List