యువ మండల్ వికాస్ అభియాన్
*మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో యువ మండల్ వికాస్ అభియాన్ కార్యక్రమం ఎర్రుపాలెం మండలంలో నిర్వహించడం జరిగింది*
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల గారి ఆదేశాల మేరకు అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమరతపు భానుచందర్ గారి సహకారంతో కోవెలశ్రీ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ కాశీన కిషోర్ కుమార్ యువ మండల్ వికస్ అభియాన్ కార్యక్రమం లో భాగం ఎర్రుపాలెం, మధిర, వైరా ఖమ్మం రూరల్, తల్లాడ, పెనుబల్లి మండలాలలో యువతకు యువ మండల్ వికాస్ అభియాన్ గురించి అవగాహన కల్పించి వారితో మైభారతలో రిజిస్ట్రేషన్ చేపించడం జరిగింది. ఆయా మండలాలు ఆయా మండలాలు యువతకు అవగాహన కల్పించడం అయిపోయిన తరువాత యర్రుపాలెం మండలంలో సర్పంచ్ ఎన్ అశ్విని,
ఏపీఎం హరి నారాయణ గార్ల, ఎంపీడీఓ సురేందర్ సహకారంతో ఈ అన్ని మండలాల నుంచి యువతను పిలిపించి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మైభారత్ తరఫున స్పోర్ట్స్ కిట్లను అందించడం జరిగింది. కార్యక్రమం విజయవంతం చేయుటకు సహకరించినందుకు ఎన్ అశ్విని మరియు ఏపీఎం హరి నారాయణ గార్ల సర్పంచ్ గార్లకు మరియు ఆ గ్రామం యొక్క యువతకు మైభారత్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

Comment List