మాండూస్‌ తుఫాన్

On

మాండూస్‌ తుఫాన్ అంచనా వేసిందానికంటే ఎక్కువే చేసింది. ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తమిళనాడులోనూ బీభత్సం సృష్టించింది. తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఈదురుగాలులు కమ్మేశాయి. భారీ వర్షాలు కూడా విరుచుకుపడ్డాయి. జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండి, పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. చాలా జిల్లాల్లో రహదారులపై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభావిత జిల్లాల్లో ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. ఇక పంటనష్టాల సంగతి వేరే చెప్పనవసరం లేదు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, […]

మాండూస్‌ తుఫాన్ అంచనా వేసిందానికంటే ఎక్కువే చేసింది.

ఏపీలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. తమిళనాడులోనూ బీభత్సం సృష్టించింది.

తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఈదురుగాలులు కమ్మేశాయి. భారీ వర్షాలు కూడా విరుచుకుపడ్డాయి.

జలాశయాలన్నీ పూర్తిస్థాయిలో నిండి, పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.

Read More మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఇన్చార్జి దద్దాల

చాలా జిల్లాల్లో రహదారులపై నీళ్లు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

ప్రభావిత జిల్లాల్లో ప్రధాన రహదారులు చెరువుల్లా మారాయి. ఇక పంటనష్టాల సంగతి వేరే చెప్పనవసరం లేదు.

తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తూర్పుగోదావరి, కాకినాడ తదితర జిల్లాలపై

తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా కనిపిస్తోంది. తిరుపతి జిల్లానైతే తుఫాన్ వణికించేసింది. అనేక ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు, కాజ్‌వేలు నీటమునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

చెట్లు విరిగి విద్యుత్తు లైన్లు, స్తంభాలపై పడ్డాయి.

తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వానలు దంచికొట్టాయి. దీంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

మొదటి ఘాట్‌రోడ్డులోని మలుపువద్ద వృక్షాలు కూలడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది.

శనివారం మధ్యాహ్నం వరకు శ్రీవారి మెట్టుమార్గం వైపునుంచి భక్తులను అనుమతించలేదు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*