ప్రభుత్వ దవాఖానలో జస్టిస్‌ షాలిని ప్రసవం

On

ఒకప్పుడు సర్కార్‌ దవాఖానలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు. ఉన్నత వర్గాలవారు ఆ వైపే చూసేవారే కాదు. కానీ, తెలంగాణలో పరిస్థితి మారుతున్నది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సర్కార్‌ దవాఖానల్లో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ దవాఖానల్లో పురుడు పోసుకొనేందుకు ముందుకు వస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాచర్ల షాలిని వరంగల్‌ జిల్లా పాపయ్యపేట చమన్‌ ప్రాంతానికి చెందిన ఆమె ఆర్మూర్‌ జిల్లా కోర్టులో […]

ఒకప్పుడు సర్కార్‌ దవాఖానలకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడేవారు.

ఉన్నత వర్గాలవారు ఆ వైపే చూసేవారే కాదు. కానీ, తెలంగాణలో పరిస్థితి మారుతున్నది.
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సర్కార్‌ దవాఖానల్లో వైద్యసేవలు మెరుగుపడుతున్నాయి

ఉన్నత హోదాలో ఉన్నవారు సైతం ప్రభుత్వ దవాఖానల్లో పురుడు పోసుకొనేందుకు ముందుకు వస్తున్నారు.

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాచర్ల షాలిని వరంగల్‌ జిల్లా పాపయ్యపేట చమన్‌ ప్రాంతానికి చెందిన ఆమె ఆర్మూర్‌ జిల్లా కోర్టులో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆమె భర్త ప్రశాంత్‌ హైదరాబాద్‌ హయత్‌నగర్‌కు చెందిన ఓ కంపెనీలో ప్రాడక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

జడ్జి షాలినికి పురుటి నొప్పులు రావడంతో హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి దవాఖాన (జీఎంహెచ్‌)కు వెళ్లారు.

Read More కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..

సామాన్య మహిళ మాదిరిగా వచ్చిన ఆమెకు అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స ద్వారా ప్రసవం జరిపించారు

ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు
సర్కార్‌ దవాఖానల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించేందుకే తాను ఇక్కడ డెలివరీ చేయించుకున్నట్టు సంతోషంగా చెప్తున్నారు జడ్జి షాలిని .

జూనియర్‌ సివిల్‌ జడ్జి హోదాలో ఉన్న షాలిని ప్రభుత్వ దవాఖానలో పురుడుపోసుకోవడం అభినందనీయమని డీఎంహెచ్‌వో సాంబశివరావు కొనియాడారు.

షాలినికి దవాఖాన సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి , డాక్టర్‌ సరళాదేవి ఆధ్వర్యంలో కేసీఆర్‌ కిట్‌ను అందజేశారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..