చైనా దాచేస్తుందా?

On

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్… మళ్లీ పంజా విసురుతుంది. కరోనా పుట్టినిల్లు చైనాను మరోసారి వణికిస్తోంది. చైనాలో కేవలం 20 రోజుల్లోనే 250 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో కేసులు తీవ్రతరం కావడం ఆందోళన కల్గిస్తోంది. చైనాలో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక […]

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్… మళ్లీ పంజా విసురుతుంది.
కరోనా పుట్టినిల్లు చైనాను మరోసారి వణికిస్తోంది.
చైనాలో కేవలం 20 రోజుల్లోనే 250 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనాలో కేసులు తీవ్రతరం కావడం ఆందోళన కల్గిస్తోంది. చైనాలో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది.
అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక ఈసారి లీక్ అయింది.
చైనా ఆరోగ్య సంస్థ ఎన్‌హెచ్‌సి సమావేశం నుండి లీక్ అయిన పత్రాలను చూసినట్లు అమెరికన్ న్యూస్ ఛానెల్ తెలిపింది.
జిన్‌పింగ్ ప్రభుత్వ రహస్య డేటా లీక్ కావడంతో చైనాలో కలకలం రేగింది. చైనాలో కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో లీక్ అయిన నివేదికను బట్టి అంచనా వేయవచ్చు.
కరోనాతో చైనా పరిస్థితి దారుణంగా మారింది. చైనా ఆరోగ్య శాఖ డిసెంబర్ మొదటి 20 రోజుల్లో 250 మిలియన్లకు బదులుగా 62వేల 592 కొత్త కోవిడ్ కేసులను మాత్రమే నివేదించిందని ఆ రిపోర్టుతో తేటతెల్లమైయ్యింది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్  డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!