చైనా దాచేస్తుందా?

On

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్… మళ్లీ పంజా విసురుతుంది. కరోనా పుట్టినిల్లు చైనాను మరోసారి వణికిస్తోంది. చైనాలో కేవలం 20 రోజుల్లోనే 250 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలో కేసులు తీవ్రతరం కావడం ఆందోళన కల్గిస్తోంది. చైనాలో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక […]

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్… మళ్లీ పంజా విసురుతుంది.
కరోనా పుట్టినిల్లు చైనాను మరోసారి వణికిస్తోంది.
చైనాలో కేవలం 20 రోజుల్లోనే 250 మిలియన్ల మందికి కరోనా వైరస్ సోకిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చైనాలో కేసులు తీవ్రతరం కావడం ఆందోళన కల్గిస్తోంది. చైనాలో కోవిడ్‌ విజృంభిస్తుండటంతో భారత్‌ కూడా అప్రమత్తమైంది.
అన్ని రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. మహమ్మారి ప్రారంభం నుండి కరోనా డేటాను దాచిపెట్టిన చైనా రహస్య నివేదిక ఈసారి లీక్ అయింది.
చైనా ఆరోగ్య సంస్థ ఎన్‌హెచ్‌సి సమావేశం నుండి లీక్ అయిన పత్రాలను చూసినట్లు అమెరికన్ న్యూస్ ఛానెల్ తెలిపింది.
జిన్‌పింగ్ ప్రభుత్వ రహస్య డేటా లీక్ కావడంతో చైనాలో కలకలం రేగింది. చైనాలో కరోనా ఎంత విధ్వంసం సృష్టించిందో లీక్ అయిన నివేదికను బట్టి అంచనా వేయవచ్చు.
కరోనాతో చైనా పరిస్థితి దారుణంగా మారింది. చైనా ఆరోగ్య శాఖ డిసెంబర్ మొదటి 20 రోజుల్లో 250 మిలియన్లకు బదులుగా 62వేల 592 కొత్త కోవిడ్ కేసులను మాత్రమే నివేదించిందని ఆ రిపోర్టుతో తేటతెల్లమైయ్యింది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) జులై 18:కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా, మద్యం సేవించి వాహనం...
బాటసింగారంలో ఎలిసియం విల్లా ప్రాజెక్ట్ ప్రారంభం..
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ