వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి:ముత్తుముల

గిద్దలూరులో 9వ రోజు రిలే నిరాహార దీక్షలు

On
వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి:ముత్తుముల

గిద్దలూరు న్యూస్ ఇండియా

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అక్రమ రిమాండ్ ను ఖండిస్తూ గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు 9వ రోజు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. ఈ సందర్బంగా వారికీ సంఘీభావం తెలియచేస్తూ అశోక్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేతను అక్రమ అరెస్ట్ చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని జగన్ చేస్తున్న దౌర్జన్యాలకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు బయపడరని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టె రోజులు దగ్గర పడ్డాయన్నారు. చంద్రబాబు కి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు.ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ షేక్షావలి, ప్రధాన కార్యదర్శి దూదేకుల నరసింహులు, తిమ్మాపురం సర్పంచ్ పసుపుల మల్లీశ్వరయ్య, కొమ్మునూరు సర్పంచ్ కర్నాటి రామసుబ్బారెడ్డి, పెద్ద మౌలాలి, ఖాసీంవలి, దాసరి విజయరాజు, మండ్ల రంగనాయకులు, కాయల సుబ్బారావు, వెంకటేశ్వర్లు, కంచర్ల కిరణ్, ఖాదర్ బాషా, బద్రి గోపాల్ రెడ్డి, కంకర వెంకట రెడ్డి, తోటకూరి ప్రభాకర్, ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, గోనుగుంట్ల వెంకటసుబ్బయ్య, మునయ్య, తోటకూరి ప్రభాకర్, నాగిరెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస నాయక్, భూపాల్ రెడ్డి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.

Views: 73
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూన్ 20:ఆదివారం నిర్వహించనున్న నీట్ (NEET) పరీక్షకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని...
వనజ మృతిపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీందర్ నాయక్ ఆరా 
గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలి
కుంజ వనజ మృతి పై డిఎంహెచ్ఓ విచారణ
సింగరేణిలో వ్రాత పరీక్షలు
తొర్రూరులో విషాదం..
. ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..