వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి:ముత్తుముల

గిద్దలూరులో 9వ రోజు రిలే నిరాహార దీక్షలు

On
వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి:ముత్తుముల

గిద్దలూరు న్యూస్ ఇండియా

రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అక్రమ రిమాండ్ ను ఖండిస్తూ గిద్దలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు 9వ రోజు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. ఈ సందర్బంగా వారికీ సంఘీభావం తెలియచేస్తూ అశోక్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేతను అక్రమ అరెస్ట్ చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని జగన్ ప్రభుత్వం కుట్ర పన్నిందని జగన్ చేస్తున్న దౌర్జన్యాలకు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు బయపడరని రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టె రోజులు దగ్గర పడ్డాయన్నారు. చంద్రబాబు కి న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందన్నారు.ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ షేక్షావలి, ప్రధాన కార్యదర్శి దూదేకుల నరసింహులు, తిమ్మాపురం సర్పంచ్ పసుపుల మల్లీశ్వరయ్య, కొమ్మునూరు సర్పంచ్ కర్నాటి రామసుబ్బారెడ్డి, పెద్ద మౌలాలి, ఖాసీంవలి, దాసరి విజయరాజు, మండ్ల రంగనాయకులు, కాయల సుబ్బారావు, వెంకటేశ్వర్లు, కంచర్ల కిరణ్, ఖాదర్ బాషా, బద్రి గోపాల్ రెడ్డి, కంకర వెంకట రెడ్డి, తోటకూరి ప్రభాకర్, ముచ్చుకుంట్ల రామసుబ్బయ్య, గోనుగుంట్ల వెంకటసుబ్బయ్య, మునయ్య, తోటకూరి ప్రభాకర్, నాగిరెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస నాయక్, భూపాల్ రెడ్డి, మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు.

Views: 73
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం.. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..   ‘భారత్ ఫ్యూచర్ సిటీ’తో తెలంగాణకు కొత్త దిశ..   ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఎఫ్‌సీడీఏ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం...
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?
ఉద్యోగ మేళ