బాలినేతో భేటీ అయిన దారపనేని దద్దాల గుంటక
కనిగిరి న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా వైకాపా సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి ని అమరావతి లోని క్యాంపు కార్యాలయంలో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, హెచ్ఎం పాడు జడ్పిటిసి దద్దాల నారాయణ, వెలిగండ్ల జడ్పిటిసి గుంటక తిరుపతిరెడ్డి శనివారము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు బాలినేనికి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. అనంతరము స్థానిక సమస్యలు వారు బాలినేనికి వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కనిగిరి ప్రాంతానికి విచ్చేయాలని వారు విన్నవించారు. పార్టీ బలోపేతం సంస్థాగత పరిస్థితులను గురించి బాలినేనికి దారపనేని, దద్దాల, గుంటక వివరించారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List