వినాయక నగర్ కాలనీలో గణనాథునికి ప్రత్యేక పూజలు
తుర్కయంజాల్ మున్సిపాలిటీ 15వ వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి
On
తుర్కయంజాల్ మున్సిపాలిటి మునగనూర్ గ్రామం వినాయక నగర్ కాలనీలో ప్రతిష్టించిన గణనాధుని పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 15వ వార్డ్ కౌన్సిలర్, మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల స్వాతి అమరేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ నక్క స్రవంతి రమేష్ గౌడ్, మాజీ వార్డ్ మెంబెర్ వెంకటేష్, కృష్ణ, శోభన్, 15వ వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దోమలపల్లి శివ కుమార్,15వ వార్డ్ బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు సద్దాం, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్, నాగరాజు, యాదగిరి, కుమార్, రాజు, మౌలాలీ, బాబు, కళ్యాణ్, శ్రీకాంత్, నర్సింగ్, మోహన్ గౌడ్, సుమన్, కాలనీ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Views: 3
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List