బెజవాడలో మళ్లీ కత్తులు నూరుతున్నారా.?

On

బెజవాడలో మళ్లీ కత్తులు నూరుతున్నారా.? ఒకప్పుడు రౌడీయిజానికి కేంద్రంగా ఉన్న విజయవాడ.. మళ్లీ ఆ దిశగా నడుస్తోందా.? అంటే అవుననే సందేహాలు వస్తున్నాయి. తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్న వంగవీటి రాధా ఆరోపణలతో.. బెజవాడ వర్గ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. చాపకింద నీరులా మళ్లీ రక్తచరిత్ర విస్తరిస్తోందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకు రాధాపై కుట్ర చేసింది ఎవరు.? ప్రత్యర్థులా.. సొంతపార్టీ వారా.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి…? గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో వంగవీటి […]

బెజవాడలో మళ్లీ కత్తులు నూరుతున్నారా.? ఒకప్పుడు రౌడీయిజానికి కేంద్రంగా ఉన్న విజయవాడ.. మళ్లీ ఆ దిశగా నడుస్తోందా.? అంటే అవుననే సందేహాలు వస్తున్నాయి. తనను హత్య చేయడానికి కుట్ర జరిగిందన్న వంగవీటి రాధా ఆరోపణలతో.. బెజవాడ వర్గ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. చాపకింద నీరులా మళ్లీ రక్తచరిత్ర విస్తరిస్తోందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకు రాధాపై కుట్ర చేసింది ఎవరు.? ప్రత్యర్థులా.. సొంతపార్టీ వారా.? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి…?

గుడ్లవల్లేరు మండలం చిన్నగొన్నూరు గ్రామంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన రాధా… తనను చంపడానికి కొందరు రెక్కీ నిర్వహించారంటూ బాంబు పేల్చారు. తనను చంపాలని చూసినా భయపడేది లేదన్నారు. దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. రంగా కీర్తి,ఆశయాల సాధనే నా లక్ష్యమన్న రాధా…తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. తనను చంపాలని చూసిన వారి బాగోతం త్వరలోనే బయటపెడతానన్నారు.

వంగవీటి రాధా చేసిన కామెంట్స్‌ ఇప్పుడు బెజవాడలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాధాపై రెక్కి నిర్వహించారనడానికి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. అయితే రెక్కి కాదు రాధాపై కొంతమంది దాడికి ప్రయత్నించారంటున్నారు ఆయన అనుచరులు. సుమారు గంటకు పైగా రాధా కార్యాలయం చుట్టు దుండగులు సంచరించారు. ఆఫీసు బయటకు వచ్చి ఫోన్‌ మాట్లాడుతుండగా అపరిచితుల కదలికలను గ్రహించిన రాధా… వారు తన ఆఫీసు దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించడంతో అనుమానించారు. వెంటనే రోడ్డుపైకి వచ్చేశారు. అపరిచితులు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారన్న విషయాన్ని రాధా గోప్యంగా ఉంచారు.

రాధాపై రెక్కి నిర్వహించిన రోజే టీడీపీ నేత పట్టాభి, టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. పట్టాభి ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని రాధాకు చెప్పారు అనుచరులు. అదే టైంలో ప్రత్యర్థుల కారు కనిపించడంతో దాన్ని ఒంటరిగా వెంబడించారు రాధా. దీంతో రాధాకు అనుమానం వచ్చిందని గ్రహించిన ప్రత్యర్థులు కారును వేగంగా పోనిచ్చారు. కారు కనిపించకుండా పోవడంతో అక్కడి నుంచి నేరుగా పట్టాభి ఇంటికి వెళ్లిన రాధా.. వారిని పరామర్శించారు. ఈ లోపు రెక్కీ విషయం రాధా అనుచరులకు కూడా తెలిసి పోయింది. దీనిపై ఆందోళన చెందిన అనుచరులు రాధాకు ఫోన్‌ చేసి సంప్రదించగా…ఈ విషయంపై ఎవరూ మాట్లాడొద్దని..అంతా తానూ చూసుకుంటానని ఆదేశించారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్