గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి

శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు

On
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి

గణేష్ మండపాల నిర్వహకులకు వివరిస్తున్న ఏసిపి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇబ్రహీం పట్నం నియోజకవ ర్గంలో నిర్వహించడం నున్న గణేష్ నిమజ్జ నాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేఎస్. రావు.. నిమజ్జనం ఏర్పాట్లపై సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తి పాటలు మాత్రమే వినిపించాలని, మతాలు, వర్గాల మనోభావాలను గౌరవిం చాలని చెప్పారు. అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈ సమావే శంలో ఎస్ఐ లు మారయ్య, మైబెల్లి, రామకృష్ణ, నాగరాజు, డిఐ బాబ్య నాయక్, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 474
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన
కొత్తగూడెంలో తల్లి హత్య కొడుకుఆత్మహత్య
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్