గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి

శాంతిభద్రతలకు భంగం కలిగించొద్దు

On
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి

గణేష్ మండపాల నిర్వహకులకు వివరిస్తున్న ఏసిపి

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇబ్రహీం పట్నం నియోజకవ ర్గంలో నిర్వహించడం నున్న గణేష్ నిమజ్జ నాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేఎస్. రావు.. నిమజ్జనం ఏర్పాట్లపై సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తి పాటలు మాత్రమే వినిపించాలని, మతాలు, వర్గాల మనోభావాలను గౌరవిం చాలని చెప్పారు. అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు.కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఈ సమావే శంలో ఎస్ఐ లు మారయ్య, మైబెల్లి, రామకృష్ణ, నాగరాజు, డిఐ బాబ్య నాయక్, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 434
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థి పల్లెర్ల మైసయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని పులిగిల్ల గ్రామంలో భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెర్ల మైసయ్య తమ స్వంత గ్రామమైన పులిగిల్లలో...
జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది