ఘనంగా మునగనూరులో ఈద్ మిలాద్ - ఉన్ - నబీ వేడుకలు...

On
ఘనంగా మునగనూరులో ఈద్ మిలాద్ - ఉన్ - నబీ వేడుకలు...

IMG20231001115836
వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా

తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూరు గ్రామంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈద్ మిలాద్ - ఉన్ - నబి వేడుకలు ఎండి. సద్దాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డు నందు జరిగిన కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ తాళ్లపల్లి సంగీత మోహన్ గుప్తా పాల్గొన్నారు. అనంతరం వారిని ముస్లిం సోదరులు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిలాద్ - ఉన్ - నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలన్నారు. ఈద్ మిలాద్ - ఉన్ - నబీ సంప్రదాయం ప్రకారం శరపథ్ ను స్వీకరించి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరి, శివ, వీరేష్, ఎండి రాక్, అనామ్, శ్రీను, రమేష్ గౌడ్, నాగరాజు,  అయాన్, సపలి, నూర్ భాష, ఆసద్, అజ్మద్, బాబా, అఫ్రీద్, ఆర్షద్ తదితరులు పాల్గొన్నారు.

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి