ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్స్. పాయకరావుపేటలో వైసీపీ మహిళా అభ్యర్ధి ఎవరంటే?

గొల్లబాబూరావుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత

On
ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్స్. పాయకరావుపేటలో వైసీపీ మహిళా అభ్యర్ధి ఎవరంటే?

YSRCP-MLA-Golla-Babu-Rao-Faces-Protest-From-Own-Party-Leaders-విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో వైఎస్ జగన్ ఏపీలో ఎన్నికలు ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. వరుసగా నాలుగైదు నెలలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజల్లోకి చొచ్చుకుపోయి.. ఫిబ్రవరిలో మేనిఫెస్టో తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మార్చిలో ఎన్నికలు ఉంటాయని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. అయితే .. ఇంతకీ కొంతమంది ఎమ్మెల్యేల్ని మార్చ, యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
వీటిలో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడితే.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పలు సర్వేలను తెప్పించుకున్న హైకమాండ్.. గొల్ల బాబూరావు తీరుపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా వ్యతిరేకతతోపాటు.. సొంత పార్టీ కార్యకర్తలు కూడా బాబూరావును ఎండగట్టినట్లు తెలుస్తోంది. కాబట్టి ఎమ్మెల్యేను మార్చి. ఆ ప్లేస్లో  మహిళా అభ్యర్ధిగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారు. టీడీపీ, జనసేనను ఉమ్మడి అభ్యర్ధిని డీకొట్టాలంటే బలమైన మాస్ ఇమేజ్ ఉన్న నాయకురాలు కావాల్సి రావడం.. ఇప్పటికే అమ్మాజీకి పాయకరావుపేటతోపాటు జిల్లా వ్యాప్తంగా పెద్ద బలగం ఉండటం.. వైసీపీకి కలిసి వస్తుందని అంటున్నారు. 
  నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్నిచేపట్టబోతున్నారు.. ఈ కార్యక్రమం తర్వాత అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 

Views: 79
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, ఆగస్టు 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం భీముని తండాలో గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున...
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి
కార్పొరేట్ విధానాలను నిరసిస్తూ జైలు భరో
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ ప్రజా చైతన్య ప్రచార యాత్ర
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు