దెగుల్ వాడిలో వాహనాలు తనిఖీ
By JHARAPPA
On
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని దెగుల్ వాడి సమీపంలోని కర్ణాటక సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు వాహనల తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా ఏఎస్ఐ నారాయణ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన క్షణమే వాహనాల తనిఖీని ముమ్మరం చేశాం అన్నారు.కర్ణాటక ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రలోనికి వస్తున్న ప్రతి వాహనాన్నీ క్షణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే వదిలేస్తున్నం అన్నారు.నిత్యం వాహనాలు తనిఖీ చేస్తామని వెల్లడించారు. వాహనాల తనిఖీకి వాహనాదారులు సహకరించాలని, లేకుంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ నారాయణ తెలిపారు. వాహనదారులు డ్రైవింగ్ లైసన్స్ మరియ, ఆర్సీలు వెంట పెట్టుకోవాలన్నారు. డబ్బుంటే దానికి సంబంధించిన ఆధారాలను చూపాలని ఏఎస్ఐ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్, బిచ్చయ్య, పీసి గోపాల్, పాల్గొన్నారు.
Views: 30
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Jul 2025 18:54:45
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 05, న్యూస్ ఇండియా : సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ, సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్...
Comment List