131 రాయల్ స్టాగ్ బాటిల్లు స్వాధీనం..

On
131 రాయల్ స్టాగ్ బాటిల్లు స్వాధీనం..

IMG_20231013_214647
నిందితుడు గోడిక్య దినేష్

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ తక్కువ ధరకు గోవాలో మద్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిఐజి శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఆదేశాల మేరకు సరూర్నగర్ డిస్ట్రిక్ట్ ప్రొహిభిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ టి రవీందర్రావు సూచనల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ బి. హనుమంతరావు నేతృత్వంలో సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు మల్లాపూర్ లో గల ఒక ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గోవాకు సంబంధించిన 131 రాయల్ స్టాగ్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి గోడిక్య దినేష్ ను విచారించగా తాను అ బాటిళ్లను గోవాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మల్లాపూర్ ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 1.20 లక్షల రూపాయల ఉంటుందని ప్రొహిభీషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ లు ముజాహిద్ సుతరి, ఇబ్రహీం పాషా, కె. సామాజ, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 42

About The Author

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*