131 రాయల్ స్టాగ్ బాటిల్లు స్వాధీనం..

On
131 రాయల్ స్టాగ్ బాటిల్లు స్వాధీనం..

IMG_20231013_214647
నిందితుడు గోడిక్య దినేష్

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ తక్కువ ధరకు గోవాలో మద్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిఐజి శ్రీనివాస్ రావు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ ఆదేశాల మేరకు సరూర్నగర్ డిస్ట్రిక్ట్ ప్రొహిభిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ టి రవీందర్రావు సూచనల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ బి. హనుమంతరావు నేతృత్వంలో సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు, సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు మల్లాపూర్ లో గల ఒక ఇంటిపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గోవాకు సంబంధించిన 131 రాయల్ స్టాగ్ బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి గోడిక్య దినేష్ ను విచారించగా తాను అ బాటిళ్లను గోవాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి మల్లాపూర్ ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 1.20 లక్షల రూపాయల ఉంటుందని ప్రొహిభీషన్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడులలో ఎస్ఐ లు ముజాహిద్ సుతరి, ఇబ్రహీం పాషా, కె. సామాజ, సిబ్బంది పాల్గొన్నారు.

Views: 42

About The Author

Post Comment

Comment List

Latest News

జగన్ ను కలిసిన కళికాయి నారాయణ జగన్ ను కలిసిన కళికాయి నారాయణ
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు  తాడేపల్లి  క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ ఇంచార్జ్ దద్దాల...
నూతనంగా సభ్యత్వం
సీజ్ ద షాప్
తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థి ఎలకల మందు తాగి మృతి
‘సమాచారం ఫుల్, చర్యలు నిల్’ ఎక్సైజ్ శాఖ నిర్వాకం!
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి..
అన్నార్థుల ఆకలి తీరుస్తున్న రెడీ టు సర్వ్ ఫౌండేషన్..