గాజా నుంచి 4 లక్షలకు పైనే తరలివెళ్లిన పాలస్తానియులు

హమాస్‌ మిలిటెంట్లను మట్టుపెట్టేందుకు ఇజ్రాయెల్‌ సైన్యం గ్రౌండ్‌ ఆపరేషన్‌

On
గాజా నుంచి 4 లక్షలకు పైనే తరలివెళ్లిన పాలస్తానియులు

గాజా నుంచి వెళ్లిపోవాలని ఆదేశించిన ఇజ్రాయెల్

పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఉధృతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఇరువర్గాలకు చెందిన 3,200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో 600 చిన్నారులతో 1,900 పాలస్తీన్లు, సహా మరణించినట్లు గాజా అధికారులు వెల్లడించారు. మరోవైపు హమాస్‌ ఉగ్రవాదుల ఊచకోతలో 1300 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృత్యువాతపడ్డారు.

తాజాగా ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇ‍జ్రాయెల్‌ సైన్యం ఆదేశించడంతో ఇక్కడి పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గాజాలో కరెంట్‌, మంచి నీళ్లు, ఆహారం, ఇంధన కొరతతో అల్లాడుతున్న అక్కడి పౌరులు ఇజ్రాయెల్‌ ఆదేశాలతో మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకొని వేలాది మంది పాలస్తీనియన్లు ఖాళీ నడకన సౌత్‌ గాజాకు తరలివెళ్తున్నారు.

ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస  
ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్‌ ఇజ్రాయెల్‌కు సూచించారు.

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు
గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్‌ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకోడంతో  ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై శక్తివంతమైన రాకెట్లు ప్రయోగిస్తోంది. ఇటు హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతున్నారు. గాజా నుంచి రాకెట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులను దక్షిణ ప్రాచ్చంలోని దేశాలు ఖండిస్తున్నాయి. బీరూట్, ఇరాక్, ఇరాన్, జోర్డాన్  బహ్రెయిన్‌లో పాలస్తీనియన్లకు భారీగా మద్దతు లభిస్తోంది. ఇజ్రాయెల్‌ దాడులకు వ్యతిరేకంగా నిరసలను వ్యక్తం చేస్తున్నారు. AP23280581439909-1696697043

Views: 65

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్! హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!
హోమ్ లోన్ తీసుకున్నవారికి బ్యాంకులు అందించే ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ గురించి చాలా మందికి తెలియదు. ఈ ఫెసిలిటీని సరైన విధంగా ఉపయోగిస్తే వడ్డీ భారం తగ్గించుకోవడంతో పాటు...
5 వేల జీతం నుంచి ₹45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే!
ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్లను ఆవిష్కరించిన : ఎస్పీ 
చైనాలో గోల్డ్ ట్రేడింగ్‌కు బ్రేక్.. ప్రపంచ బంగారం మార్కెట్‌లో అలజడి.. అసలు ఏం జరుగుతోంది?
ఈసారి ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగులు.. పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో దర్శనం!
ఉప్పు, కారం, నూనె, పప్పులు.. ధరలు పెరుగుతాయా? ఆర్బీఐ తాజా రిపోర్ట్‌లో ఏముంది?
తెలంగాణలో కూడా జొన్నగిరి తరహా బంగారు గనులు ఉన్నాయా? గద్వాల, వనపర్తి, నల్గొండలో గోల్డ్ మైనింగ్ అవకాశాలపై పూర్తి విశ్లేషణ