విద్యుత్ మాయాజాలం అసలు కంటే కొసరే ఎక్కువ

On
విద్యుత్ మాయాజాలం    అసలు కంటే  కొసరే ఎక్కువ

యర్రగొండపాలెం పట్టణంలో స్థానికంగా  ఉంటూ చిరు వ్యాపారం నిర్వహించుకునే ఒక వ్యక్తి కి ఈనెల 10వ తేదీన వచ్చిన కరెంటు బిల్లును చూసి ఖంగుతిన్నాడు.. దాదాపు 84460 రూ.. వచ్చింది. ప్రతినెల తాను కరెంట్ బిల్లు చెల్లిస్తున్నప్పటికీ ఇంత  మొత్తంలో రావడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.ఈ విషయమై విద్యుత్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో 
వేచి చూడాలి? యర్రగొండపాలెం మండలంలో తెలిసి ఇదొక్కటే తెలియక ఇంకా ఎన్ని అధికంగా వచ్చిన కరెంటు బిల్లులు ఉన్నాయో  వాళ్ళకే  తెలియాలి?  వచ్చిన కరెంటు బిల్లులను ఏ మేరకు తగ్గించి వినియోగదారుల పై భారం పడకుండా చూస్తున్నారో   చెప్పవలసిన బాధ్యత వారి పై ఉంది...
వాస్తవంగా విద్యుత్ బిల్లులు  ప్రజలకు షాక్ కొడుతున్నాయి.పెరిగిన బిల్లులతో జనం గగ్గోలు పెడుతున్నారు అనడానికి .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 7 రకాల చార్జీల పేరుతో ప్రజల కళ్ళుగప్పి కోట్ల రూపాయలును ప్రజల నెత్తిన మోపారని అని తెలియజేయడానికి ... విద్యుత్ మాయాజాలంతో అసలు చార్జీలకంటే  కొసరు చార్జీలు ఎక్కువయ్యాయని నిరూపించడానికి ... విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని  చూపించడానికి ఈ ఒక్క ఉదాహరణ సరితూగుతుంది..
రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ భారాలు - సంస్కరణలపై ఈ నెల 12వ తేదీన సిపిఐ వామపక్షాల పార్టీలు మండలం లో  ప్రజా బ్యాలెట్ నిర్వహించి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేస్తున్నారు అంటే  పరిస్థితి
ఎంత తీవ్రంగా ఉందో  అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రజలకు 
ఎంతైనా ఉంది?IMG-20231014-WA0456

Views: 82

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News