పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం

కార్యక్రమం లో పాల్గొన్న ఆరు మండలాల ఎస్సై లు

On
పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం

గిద్దలూరు న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని డిఎస్పి వీర రాఘవరెడ్డి, సీఐ దేవ ప్రభాకర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ రక్తదాన శిబిరంలో గిద్దలూరు,కంభం సర్కిల్ పరిధిలోని ఎస్సైలు పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. అలానే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానాన్ని చేశారు. రక్తదానంపై అపోహలు వీడి ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయాలని డిఎస్పి వీర రాఘవరెడ్డి రక్తదాతలకు విజ్ఞప్తి చేశారు. అలానే విధి నిర్వహణలో అంకిత భావం ప్రదర్శిస్తూ అసువులు బాసిన పోలీసులకు నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పోలీసు సిబ్బందిని ప్రజలను డిఎస్పి వీర రాఘవరెడ్డి అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో గిద్దలూరు ఎస్సైలు మహేష్, అజితారావు,కొమరోలు ఎస్ఐ సుబ్బరాజు,రాచర్ల ఎస్సై కృష్ణ పావని,బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు, కంభం ఎస్సై పులి రాజేష్, అర్ధవీడు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

IMG-20231022-WA0271
డీఎస్పీ వీర రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
IMG-20231022-WA0272
బ్లడ్ డొనేట్ చేస్తున్న పోలీసులు
IMG-20231022-WA0269
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా గిద్దలూరు పోలీస్ స్టేషన్లో ఆవరణంలో రక్తదాన శిబిరం
Views: 147

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

.   ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. . ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు..
మహబూబాబాద్ జిల్లా : ఏసీబి చిక్కిన నర్సింహులపేట ఎంపిడిఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, తో పాటు ఎంపిడిఓ కుమారుడు.. పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్...
భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరం..
గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తొర్రూరు పోలీసుల ముమ్మర తనిఖీలు
గంజాయి రవాణా కేసు నిందితుడి అరెస్ట్
సీఎం సభ విజయవంతంపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హర్షం..
అనుకూలమైన భూమిని వదిలి గుట్టలపై మార్కెట్ ఎందుకు..?
కొహెడ రైతులకు పరిహారం ఇవ్వకుండా ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనా?