ఆచార్య వస్తున్నాడు..

On

coming soon acharya-chiru:  “ఆచార్య” సినిమాతో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వం వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది.   ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న “ఆచార్య” టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ […]

coming soon acharya-chiru:  “ఆచార్య” సినిమాతో తమ అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వం వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది.

 

ఈ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న “ఆచార్య” టీం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తాజాగా ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ… తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేస్తానంటూ అధికారికంగా ప్రకటించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

మెగా ఫ్యాన్స్ ఎంతకాలం నుంచో ఈ కాంబోను వెండితెరపై వీక్షించాలను కోరుకుంటున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి చేయనున్న ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ఇప్పటికే జరిగాయని, కొన్ని కాన్సెప్ట్ లు కూడా రెడీగా ఉన్నాయని, ఇక ఈ భారీ ఆ మల్టీస్టారర్ సినిమాను స్వయంగా తానే నిర్మిస్తానని చరణ్ కన్ఫర్మ్ చేశాడు. ఓవైపు “ఆచార్య”తో తండ్రితో, మరోవైపు బాబాయ్ తో కూడా చెర్రీ స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి బాబాయ్, అబ్బాయ్ కలిసి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్..
జెఇ వ్యాక్సిన్ తో మెదడు వాపు వ్యాధికి చెక్.. ఎల్బీనగర్, జులై 27 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి, తొర్రూర్ గ్రామంలోని...
పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుత డిజిటల్ యుగంలో నెలకొన్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్
రాష్ట్ర స్థాయి ఫోటో ఎగ్జిబిషన్ కు సురక్ష సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షునికి ఆహ్వానం..
డంపింగ్ యార్డ్ లేక ప్రధాన రహదారి ప్రక్కనే  పట్టణ వ్యర్ధాలు