గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తే….గృహ లక్ష్మీకి అనర్హులా…?

న్యూస్ ఇండియా తెలుగు, అశ్వారావుపేట నియోజకవర్గం, సెప్టెంబర్ 23, 2023

On
గిరిజనులకు పోడు పట్టాలు ఇస్తే….గృహ లక్ష్మీకి అనర్హులా…?

మా ఓట్లతో గెలుస్తారు గెలిచాక అంతా తారుమారు సాక్షాత్తు ఎమ్మెల్యే సందర్శించి ఇల్లు కట్టిస్తాం అన్న జరగని పని స్థానిక అధికార పార్టీ నాయకులను అడిగితే మాపై హేళనగా మాట్లాడుతున్నారు- పెంచికలపాడు గ్రామస్తులు

బంగారు తెలంగాణా రాకతో చీకట్లలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మా గిరిజన బ్రతుకులు మారతాయని ఆశపడ్డాం. కానీ అంతా మాములే ఎప్పటిలానే మా గూడెం బ్రతుకులు మారలేదు.గెలిస్తే ఇళ్ళు ఇస్తాం. రోడ్లు ఇస్తాం మీ బ్రతుకులు మార్చేస్తాం అంటూ మాయ మాటలు చెప్పి మా ఓట్లతో అధికారంలోకి వచ్చారు,కానీ గెలిచాక అంతా తారుమారైపోయింది కనీసం మా వైపు చూసిన నాయకుడే లేకుండా పోయారు మళ్ళీ ఏమోహం పెట్టుకొని ఓట్లు అడుగుతారో మేము చూస్తాం సారు అంటూ తమ బాధను వెళ్లగక్కారు అశ్వారావుపేట మండలం నారాయణపురం పంచాయితీ పెంచికలపాడు గ్రామస్థులు ఈ గ్రామంలో ఉన్న ముప్పై ఇళ్ళు….. పురిగుడిసెలే అవికూడా రేపో మాపో పడిపోయేలా ఉన్నాయి,వర్షం వస్తే మురికి నీరంతా ఇళ్ళ లొనే.. ఇప్పటికి డ్రైనేజీ వ్యవస్థ లేని గిరిజన ప్రాంతం మురికి నీటి నిల్వలతో దోమల జ్వరాల బారిన గ్రామస్థులు, పట్టించుకునే నాయకుడే లేకుండా పోయారు,సాక్ష్యత్తు అశ్వారావుపేట ఎమ్మెల్యే ఒకసారి తమ గ్రామాన్ని సందర్శించినప్పుడు మా కూలిపోయే గుడిసెలు చూపించాం దంతో ఇంకేముంది ఇళ్ళన్ని పీకేసి పక్క ఇళ్ళు కట్టిస్తానని మాట ఇచ్చారు కానీ మళ్ళీ పట్టించుకోలేదు,మరోసారి స్థానిక అధికార పార్టీ నాయకులకు సర్పంచ్,జెడ్పిటిసి, లకు మా బ్రతుకి పరిస్థితి చెప్తే నారాయణపురం సొసైటీ ఛైర్మెన్ మమ్మల్ని హేళనచేస్తు ఊరికే వేశారా మాకు ఓట్లు ఇళ్ళు కావాల మీకు,పొడుభూమి పట్టాలు ఇస్తే ఇళ్ళు రావు మీకు….., మళ్ళీ పక్క ఇళ్ళు కావాలా…. ? మీకు ఇళ్ళు ఇవ్వడం కుదరదని చెప్పారని గ్రామస్థులు వాపోయారు మళ్ళీ ఏమోహం పెట్టుకొని మా ఓట్లకోసం ఎలా వస్తారో చూస్తామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.మా గిరిజన ప్రాంతాల్లో పంచాయితీ పారిశుధ్యం నిద్ర పోతోందని కనీసం మా గిరిజన ప్రాంతానికి చెత్త సేకరించే ట్రాక్టర్ కూడా రాదని ఊరిలో చెత్త అంత మేమె ఎక్కడికక్కడ కాల్చేస్తున్న పరిస్థితి ఉందని తెలియజేసారు.

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ