హారతులు ఇస్తూ డప్పు లతో స్వాగతం

కాంగ్రెస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమావుతుంది

On
హారతులు ఇస్తూ డప్పు లతో స్వాగతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా // అశ్వారావుపేట // అశ్వరావుపేట నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేట మండలం లోని శుద్ధగోతులు గూడెం,రెడ్డిగూడెం,తిరుమలకుంట కాలనీ, తిరుమలకుంట,మామిళ్ళవారిగూడెం,  నారాయణపురం, తదితర గ్రామాలు  కాంగ్రెస్ అభ్యర్థి జారే ఆదినారాయణ ఉరురు తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు,గ్రామ పొలిమేరల్లో మహిళలు,గ్రామస్తులు జారే ఆదినారాయణకి ఎదురొచ్చి హారతులు ఇస్తూ డప్పు లతో స్వాగతం పలికారు, చిన్న పెద్ద, ధనిక  పేదా అని తేడా లేకుండా అందరినీ పలకరిస్తూ, కాంగ్రెస్ను గెలిపించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఒకసారి అవకాశం,ఇవ్వాలి, పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శలు గుప్పించారు, ఈ శాసనసభ ఎన్నికల్లో  బిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అని కాంగ్రెస్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమావుతుందని తెలిపారు, కాంగ్రెస్ గెలిపించుకోవాలని  కోరారు, ప్రచార కార్యక్రమంలో భాగంగా, పాట పాడి కార్యకర్తలను నాయకులను మహిళలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జారి ఆదినారాయణ తో పాటు వివిధ పంచాయతీల సర్పంచులు,ఎంపీటీసీలు,పార్టీ కార్యకర్తలు,అభిమానులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Views: 34
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.