కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేత
ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
జనగామ జిల్లా:
పాలకుర్తి మండలకేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు 19,02,204 రూ. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి.ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని,లబ్ధిదారులు మధ్య దళారులను ఆశ్రయించి డబ్బులు ఇవ్వవద్దని,ఏదైనా సమస్య ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని,మన నియోజకవర్గం పక్క నియోజకవర్గాలకు రోల్ మోడల్ గా ఉండాలని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తున్నా బయట కొంత మంది ఓడిపోయామనే అక్కస్సుతో ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని,కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని,అందులో రెండు హామీలు ఇప్పటికే అమలు చేశామని అన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List