ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన మేకల కాపరి

రుద్రంగి, జనవరి30,న్యూస్ ఇండియా ప్రతినిధి

On
ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన మేకల కాపరి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం బండరెంజల్ గ్రామానికి  చెందిన బాగయ్య (24) అనే మేకల కాపరి ప్రమాదవశత్తు బావిలో పడి మృతి చెందిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం గైదిగుట్ట అడ్డబోర్ తాండల సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిసిన వివరాల ప్రకారం..IMG_20240130_222446

రుద్రంగి మండలం గైదిగుట్ట అడ్డబోర్ తండా సమీపంలో మంగళవారం ఉదయం బాగయ్య మేకలను తీసుకొని మేపడానికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనం చెయ్యడానికి తాగడానికి నీళ్లు లేకపోవడంతో  తన మిత్రుడి కి నీళ్లు తీసుకువస్తా అని బాగయ్య సమీప దగ్గరలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళాడు. నీళ్లకోసం వెళ్లిన బాగయ్య ప్రమాదవశాత్తు బావిలో పడిపోగా బాగయ్య రాకపోయే సరికి బావి దగ్గరకి తన మిత్రుడు బావి దగ్గరికి వెళ్లే సరికి బావి వద్ద చెప్పులు, గొంగడి ఉన్నట్టు గుర్తించాడు. ఈ విషయం వెంటనే దగ్గరలో ఉన్న స్థానికులకు చేరవేయగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి బంధువులకు సమాచారం అందించి పోస్ట్ మార్టం నిమిత్తం సిరిసిల్లకు తరలించినట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.

Views: 336
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి.. నమిశ్రీ అక్రమాలను అడ్డుకోవాలి..
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్, సర్వే నంబర్–38లో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి త్రవ్వకాలు చేపడుతున్న నమిశ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థపై తక్షణ...
సూర్యతండ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భుక్యా సక్రి మంగీలాల్
సాతానిగూడెం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా రెడ్యానాయక్
వెంకటాపురం గ్రామాన్ని ఆదర్శ  గ్రామంగా తీర్చిదిద్దుతాం*
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ ను పరామర్శించిన మంత్రి తుమ్మల
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించండి 
ఉప్పలచాలక గ్రామ సర్పంచిగా గెలుపొందిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శారద చందు