గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి

ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల వార్షికోత్సవం

On
గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయి

 

మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని, విద్యార్థుల భవిష్యత్తుకు పాఠశాలలోనే పునాది పడుతుందని మహాత్మ జ్యోతిబాపూలే సిఓఈ వీరభద్రం అన్నారు. శనివారం కొత్తగూడెం పరిధిలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాలు పాఠశాల ప్రిన్సిపల్ ఈ స్వప్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్మ జ్యోతిబాపూలే సిఓఈ వీరభద్రం, ఫ్రాన్సిస్, స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్ లు ముఖ్యఅతిథిలుగా పాల్గొని పాఠశాల ప్రిన్సిపాల్ ఈ స్వప్న,ఏటిపి డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఎం పద్మశ్రీ, బి అరుణావతి లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంజెపిటి సిఓ ఈ వీరభద్రం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మొదటి మెట్టు పాఠశాల అని, గురుకుల పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు నేడు గొప్ప ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి పెట్టే విధంగా నడవడిక ఉండాలన్నారు. ఏ రంగంలో చూసిన గురుకుల విద్యార్థులే అధిక సంఖ్యలో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థినుండే క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశానికి సేవ చేయాలని ఉద్బోధించారు. ఎక్కడ పోటీ ఉంటుందో అక్కడ పోరాడే పఠిమను విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు.

*విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యున్నత శిఖరాలు చేరుకోవాలి-ప్రిన్సిపల్ ఈ స్వప్న.

శనివారం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో జరిగిన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఈ స్వప్న పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు.విద్యార్థులు క్రమశిక్షణతో రాణించి మన మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల పేరు ప్రఖ్యాతలను రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాలని విద్యార్థులకు తెలిపారు. ఇదే సంస్థ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకున్న పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.క్రమశిక్షణ, ప్రశాంత వాతావరణం, క్రీడామైదానం,ఉత్తమ ఉపాధ్యాయులు లభించడం విద్యార్థుల అదృష్టమన్నారు. అనంతరం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఎన్ హేమంత్ వర్ధనాచారి మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో అత్యధిక మార్పులు సాధించినందుకుగాను అతిథుల చేతుల మీదుగా విద్యార్థిని సన్మానించి మెమొంటో అందజేశారు. అలాగే విద్యలో, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమొంటోలు,షీల్డులు తన చేతుల మీదుగా అందించారు.పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆహుతులను,సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఈ స్వప్న ,ఏటీపీ డాక్టర్ సి ప్రవీణ్ కుమార్,ఎం పద్మశ్రీ, పి అరుణావతి,ఎన్ శ్రీనివాస్,జి రవికుమార్,కె నగేష్,పి ప్రవీణ్,పి స్నేహలత,ఎం మమత, అతిధి అధ్యాపకులు తిరుమలగిరి వెంకటేశ్వర్లు, బాలరాజు,లోహిత, సందీప్,నవీన్,రాహుల్, విశ్వనాథ్,శ్రీకాంత్, మమత,నరసింహా, లింగస్వామి,శేఖర్, షబానా,సుశీల,డి సరిత, ఎం సరిత, ఖదీర్, పిఈటి మాస్టర్ వెంకట్రావు, పాఠశాల డీఈఓ నాగరాజు,ధీరజ్, గురవయ్య,ఉమ,జిఎన్ ఎం ఆరూరి రజిని, అటెండర్ సబిత తదితరులు పాల్గొన్నారు.IMG-20240210-WA1030

Read More ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu

Views: 224

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
తమిళ రాజకీయాల్లో భారీ ట్విస్ట్..! దళపతి విజయ్ సీఎం అయిన తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. స్టాలిన్‌ను కలవడం...
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
మైనింగ్ మాయాజాలం..
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవం