తెలంగాణ రాష్ట్రంలో మొదటి అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే

రెండో అతి పెద్ద జాతర ఎక్కడ తెలుసా..?

On
తెలంగాణ రాష్ట్రంలో మొదటి అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క అయితే

న్యూస్ ఇండియా తెలుగు,  ఫిబ్రవరి 17 (నల్లగొండ జిల్లా ప్రతినిధి) పెద్దగట్టు జాతర,  తెలంగాణ రాష్ట్రంలో  జరిగే రెండవ పెద్ద జాతర.ఇక్కడికి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలలోనుండే కాక పొరుగున వున్న  చతిస్గడ్ ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర రెండేళ్ళ కొక సారి అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది .peddagutta-jatara-1

 ఈ జాతరకు సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. రాష్ట్ర కూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని.. ఆయన పేరిటే ఈ గ్రామం దురాజ్‌పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మిక. దురజ్‌పల్లికి సమీపంలో ఉండ్రుగొండ గ్రామం ఉంది. దీని శివారులో ఏడెనిమిది కొండగుట్టలున్న అటవీప్రాంతం ఉంది. ఇక్కడ శైవ, వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాళ్లు, రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది. గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగుట్టపై ఈ జాతర జరిగేదట.  


దురాజ్‌పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర. లింగమంతులస్వామి యాదవుల ఆరాధ్యదైవం. జాతరకు ఒకరోజు ముందే ఎడ్లబండ్లు, ఆటోలు, ట్రాక్టర్లపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. మగవాళ్లు ఎరుపు రంగు బనియన్, గజ్జెల కుట్టిన లాగులు ధరించి కాళ్లకు గజ్జెలు, చేతిలో అవుసరాలు పట్టుకుని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్దంగా నడుస్తూ ఒలింగా... ఓ లింగా ........ అంటూ హోరెత్తిస్తారు. మహిళలు తడి బట్టలతో పసుపు, కుంకుమ, పూలదండలు, అగరొత్తులతో అలంకరించిన మంద గంపను నెత్తిన పెట్టుకుని నడుస్తుంటారు. సంతానంలేని మహిళలు బోనం కుండ ఎత్తుకుంటారు. దేవుడికి బలిచ్చే గొర్రెపొటేల్‌ను తీసుకొస్తారు . ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రెపొటేల్‌కు స్నానం చేయిస్తారు. పూలదండ వేసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు. గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు. లింగమంతుడు సహా చౌడేశ్వరి (సౌడమ్మ, చాముండేశ్వరి), గంగాభవాని, యలమంచమ్మ, అకుమంచమ్మ, మాణిక్యాలదేవులకు పూజచేస్తారు.  

లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం (శాకాహారం) సమర్పిస్తారు. మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు. రెండేళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా.. భక్తజన లింగనాదాల మధ్య ప్రారంభమవుతా యి. రాష్ట్రం నలుదిక్కుల నుంచే కాక.. ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 15 లక్షలకు పైగా భక్తులు ఈ జాతరకు వస్తుంటారు. 

Read More హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!

peddagattu-jatara-1-1551232117

Read More ఏపీ Future Ready Ecosystem అంటే ఏమిటి? అమరావతి నుంచి విశాఖ వరకు భారీ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్!

ఇది ఐదు రోజుల పండుగ. శనివారం మధ్యాహ్నం మూలవిరాట్‌లకు అలంకరణ మొదలయింది. వరంగల్ జిల్లా చీకటాయపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మ పల్లకి తీసుకురాగా.. సూర్యాపేట నుంచి మకరతోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరించారు.         

Read More అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!

జాతర జరిగే తొలిరోజు భక్తులు రాత్రి తమ ఇళ్లలో గంపలు వెళ్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సంప్రదాయ ఆయుధాలు తీసుకుని రాత్రికి లోపే ఇక్కడకు చేరుకున్నారు. రెండోరోజు. యాదవ పూజారులు పోలు ముంతలు.. బొట్లు.. కంకణ అలంకరణలు చేయగా.. మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకుని లింగమంతులస్వామికి నైవేద్యం సమర్పిస్తారు. మిగతా దేవతలకు జంతుబలులు సమర్పిస్తారు. మూడో రోజున చంద్రపట్నం వేస్తారు. బియ్యం పిండి, పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగువైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు. నాలుగో రోజు నెలవారం. దిష్టిపూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్లి అక్కడ నిలుపుతారు. దానిని తర్వాత వచ్చే జాతరకు తీసుకొస్తారు. ఐదో రోజు... మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. ఇలా ఐదు రోజుల పాటు ఈ జాతర మహా వైభోగంగా జరుగుతుంది.

peddagattujathara

Views: 114

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!
ఏపీ Future Ready Ecosystem అంటే ఏమిటి? అమరావతి నుంచి విశాఖ వరకు భారీ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్!
హోమ్ లోన్‌లో ఓవర్‌డ్రాఫ్ట్ ఫెసిలిటీ తెలుసా? ఇలా చేస్తే లక్షల్లో వడ్డీ ఆదా చేసే ఛాన్స్!
5 వేల జీతం నుంచి ₹45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే!