ఎంపీటీసీ అరే లావణ్య రవీందర్ ను బిజెపిలోకి రావాలని ఆహ్వానించిన -

ఎంపీ అరవింద్, బాల్కొండ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి

On
ఎంపీటీసీ అరే లావణ్య రవీందర్ ను బిజెపిలోకి రావాలని ఆహ్వానించిన -

ఇందూరు, ఫిబ్రవరి20, న్యూస్ ఇండియా ప్రతినిధి

ఇందూరు పార్లమెంట్ ఎన్నికల ముందు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నేతలు ఆ గట్టు నుంచి ఈ గట్టుకు దాటి పోతున్నారు. తాజాగా భింగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత, భింగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఆరే లావణ్య రవీందర్ ఇటీవలే కారు పార్టీకి గుడ్ బై చెప్పిన  విషయం తెలిసిందే.. 

ఆరే లావణ్య రవీందర్ రాజినామ చేసి నేల  గడవక ముందే బిజెపి పెద్దలు సంప్రదింపులు జరిపి. కమలదళం వైపు రావాలని ప్రయత్నాలు షురూ  చేశారు.. IMG-20240220-WA0035ఇందూరు ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున రెడ్డి అధ్వర్యంలో నియోజకవర్గ కన్వీనర్ మల్కన్న గారి మోహన్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు ములిగే మహిపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమ్మేడా మల్లికార్జున్ లు స్వయంగా మెండోరా యంపీటీసీ ఆరే లావణ్య రవీందర్ ఇంటికి వెళ్లి బిజెపి లోకి రావాలని వారితో పాటు బీఆర్ యస్ పార్టీ నాయకులను ఆహ్వానించారు. ఇందూరు ఎంపీ ధర్మపురి అరవింద్, బాల్కొండ ఇంచార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ఆహ్వానాన్ని అరే లావణ్య రవీందర్ తో పాటు పలువురు బీఆర్ యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. img_20240206_174643

త్వరలోనే తమ కార్యకర్తలతో పాటు బీఆర్ యస్ పార్టీ నాయకులు బిజెపి పార్టీలో చేరుతున్నట్టు  మంగళవారం ఉదయం ఎంపీటీసీ ఇంట్లో జరిగిన ఆత్మీయుల మద్యలో జరిగిన సమావేశంలో నిర్ణయించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం..

Read More 5 వేల జీతం నుంచి ₹45 లక్షల ప్యాకేజీ.. బెంగళూరు టెక్కీ సక్సెస్ స్టోరీలో అసలు ట్విస్ట్ ఇదే!

Views: 165

About The Author

Post Comment

Comment List

Latest News

డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్  డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
భద్రాద్రి కొత్తగూడెం,(న్యూస్ ఇండియా ప్రతినిధి) జూలై 4: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ (డీఎఫ్ఓ) అధికారిగా సిద్ధార్థ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా...
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి
తొర్రూరులో టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన
సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు
వడ్డే నవీన్ మొదటి భార్య ఎవరు? విడాకుల తర్వాత కెరీర్ ఎందుకు క్షీణించింది? నిజాలు, ప్రచారాల పూర్తి విశ్లేషణ
భారతదేశంలోని 5 అత్యంత మిస్టరీ ప్రదేశాలు.. శాస్త్రవేత్తలకూ పూర్తి సమాధానం దొరకని రహస్యాలు!
అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం.. తవ్వితే అంతా బంగారమేనా? 2300 ఏళ్ల చరిత్రలో దాగిన నిజాలు!