వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

On
వరకట్న వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య

 

కొత్తగూడెం (న్యూస్ ఇండియా)జూన్ 22: లక్ష్మీదేవిపల్లి  మండలం కారుకొండ గ్రామపంచాయతీలో వరకట్న వేధింపులతో యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాల బోయిన మానస(20)సూర్యాపేట జిల్లా నడిగూడెం బృందావనపురం గ్రామానికి చెందిన యువతికి లక్ష్మీదేవిపల్లి మండలం  కారుకొండ గ్రామానికి చెందిన సంతోష్ తో వివాహం జరిగింది. కొన్ని నెలల పాటు వీరి దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉండి ఒక బాబు కూడా జన్మించాడు. సంవత్సరం తర్వాత అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించడంతో యువతి శుక్రవారం రోజు పురుగుల మందు తాగింది స్పందించిన స్థానికులు కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు మెరుగైన చికిత్స కోసం తీసుకు వెళుతుండగా మార్గ మధ్యలో మృతి చెందింది యువతి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మిదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Views: 293
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు.. రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...
గుడుంబా నిర్మూలనకు పోలీసుల కఠిన చర్యలు
తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు