రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం..

పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

On

IMG_20240803_174304
వాహనాలను పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్

రంగారెడ్డి, ఆగష్టు 03 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వాళ్లపై పిడి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు వాహనం ఆర్సి రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కు సిఫారసు చేయనున్నట్లు పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రాంతంలో పలువాహన వాహనాలను రేషన్ బియ్యం దందాకు వాడుతున్నారు అన్న అనుమానంతో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ ప్రారంభమై నాలుగు రోజులు అయ్యిందని దీంతో కొందరు రేషన్ దందా అక్రమార్కులు గుర్తుగా స్టార్ట్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు దీంతో పెద్ద గోల్కొండ, శంషాబాద్ జాతీయ రహదారిపై అనుమానంతో పలు వాహనాలను తనిఖీ చేసి ఆయా లోడ్లలో ఉన్న సరుకు ఏంటి అని ఆరా తీసినట్లు విచారించారు. రేషన్ బియ్యం అక్రమంగా దందా చేస్తే జైలు శిక్ష ఖాయమని రఘునందన్ హెచ్చరించారు. రేషన్ బియ్యం కొంటే మిల్లు మూసేయడమే అని పలు మిల్లులకు సైతం హెచ్చరిక జారీ చేశామన్నారు.

Views: 32
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా...
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం   
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం