రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం..

పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

On

IMG_20240803_174304
వాహనాలను పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్

రంగారెడ్డి, ఆగష్టు 03 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వాళ్లపై పిడి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు వాహనం ఆర్సి రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కు సిఫారసు చేయనున్నట్లు పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రాంతంలో పలువాహన వాహనాలను రేషన్ బియ్యం దందాకు వాడుతున్నారు అన్న అనుమానంతో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ ప్రారంభమై నాలుగు రోజులు అయ్యిందని దీంతో కొందరు రేషన్ దందా అక్రమార్కులు గుర్తుగా స్టార్ట్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు దీంతో పెద్ద గోల్కొండ, శంషాబాద్ జాతీయ రహదారిపై అనుమానంతో పలు వాహనాలను తనిఖీ చేసి ఆయా లోడ్లలో ఉన్న సరుకు ఏంటి అని ఆరా తీసినట్లు విచారించారు. రేషన్ బియ్యం అక్రమంగా దందా చేస్తే జైలు శిక్ష ఖాయమని రఘునందన్ హెచ్చరించారు. రేషన్ బియ్యం కొంటే మిల్లు మూసేయడమే అని పలు మిల్లులకు సైతం హెచ్చరిక జారీ చేశామన్నారు.

Views: 32
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి
అభివృద్ధి నుంచి దృష్టి మరల్చేందుకే ఆరోపణలు: మల్‌రెడ్డి రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం, జూలై 9: అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ నేత...
అధికారులు సర్వే చేసి భూములకు శాశ్వత హద్దులు నిర్ణయించాలి
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
డబుల్ బెడ్‌రూమ్ ఇంటికి తాళం.. కలెక్టరేట్‌లో భాగ్యమ్మ ఆవేదన..
పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన డీజీపీ 
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ విక్రమ్ సింగ్ 
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయండి