రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం..

పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

On

IMG_20240803_174304
వాహనాలను పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్

రంగారెడ్డి, ఆగష్టు 03 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వాళ్లపై పిడి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు వాహనం ఆర్సి రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కు సిఫారసు చేయనున్నట్లు పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రాంతంలో పలువాహన వాహనాలను రేషన్ బియ్యం దందాకు వాడుతున్నారు అన్న అనుమానంతో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ ప్రారంభమై నాలుగు రోజులు అయ్యిందని దీంతో కొందరు రేషన్ దందా అక్రమార్కులు గుర్తుగా స్టార్ట్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు దీంతో పెద్ద గోల్కొండ, శంషాబాద్ జాతీయ రహదారిపై అనుమానంతో పలు వాహనాలను తనిఖీ చేసి ఆయా లోడ్లలో ఉన్న సరుకు ఏంటి అని ఆరా తీసినట్లు విచారించారు. రేషన్ బియ్యం అక్రమంగా దందా చేస్తే జైలు శిక్ష ఖాయమని రఘునందన్ హెచ్చరించారు. రేషన్ బియ్యం కొంటే మిల్లు మూసేయడమే అని పలు మిల్లులకు సైతం హెచ్చరిక జారీ చేశామన్నారు.

Views: 25
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..