రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం..

పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్..

On

IMG_20240803_174304
వాహనాలను పరిశీలిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్

రంగారెడ్డి, ఆగష్టు 03 (న్యూస్ ఇండియా ప్రతినిధి): రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసే వాళ్లపై పిడి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయడంతో పాటు వాహనం ఆర్సి రద్దు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కు సిఫారసు చేయనున్నట్లు పౌరసరపరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శంషాబాద్ ఓఆర్ఆర్ ప్రాంతంలో పలువాహన వాహనాలను రేషన్ బియ్యం దందాకు వాడుతున్నారు అన్న అనుమానంతో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ ప్రారంభమై నాలుగు రోజులు అయ్యిందని దీంతో కొందరు రేషన్ దందా అక్రమార్కులు గుర్తుగా స్టార్ట్ తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు దీంతో పెద్ద గోల్కొండ, శంషాబాద్ జాతీయ రహదారిపై అనుమానంతో పలు వాహనాలను తనిఖీ చేసి ఆయా లోడ్లలో ఉన్న సరుకు ఏంటి అని ఆరా తీసినట్లు విచారించారు. రేషన్ బియ్యం అక్రమంగా దందా చేస్తే జైలు శిక్ష ఖాయమని రఘునందన్ హెచ్చరించారు. రేషన్ బియ్యం కొంటే మిల్లు మూసేయడమే అని పలు మిల్లులకు సైతం హెచ్చరిక జారీ చేశామన్నారు.

Views: 17
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు...
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్
రాజ్యాంగం దినోత్సవం
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..