ఐటిఐ అభ్యర్థులకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళ

వివరాలు తెలిపిన ఐటిఐ నోడల్ ఆఫీసర్ జి రమేష్

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 3: 09-09-2024 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ల అభ్యర్థులు  భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పరిదిలోగల వివిద పరిశ్రమలలో అప్పెంటిషిప్ ట్రైనింగ్ చేయుట కొరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళ నిర్వహించుటకు నిర్వహించారు. ఇందు నిమిత్తము ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ముందుగా www.apprenticeshipindia.org.in నందు వారి పేరు నమోదు చేసుకొని అట్టి నకలు కాపీని, ఒక బైయో డేటా ఫామ్ ను మరియు తమ సంబందిత విద్యార్హత ధృవీకరణ పత్రాలు కూడా జత చేసి అప్రెంటిషిప్ మేలా కు హాజరు కావలసినదిగా కోరడమైనది.భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ ప్రధానాచార్యులు, పరిశ్రమల యాజమాన్యాల వారు తమ పరిదిలోని అప్రెంటిషిప్ ఖాళీల వివరాలతో ది. 09-09-2024 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు హాజరు అవుతారు.కావున భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా లోని ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనవలసినదిగా ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం ప్రదాణాచార్యులు మరియు భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ నోడల్ ఆఫీసర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Views: 109
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
ఖమ్మం మార్చి 1 ఖమ్మం న్యూస్ ఖమ్మం ఎస్ఆర్ గార్డెన్ లో శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా భారత మాజీ...
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు
కుమ్మెర ఘటన నిందితులకు ఉరిశిక్ష విధించాలి: సీపీఎం డిమాండ్..
ఇంటర్ ఎగ్జామ్స్.., సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ 
కార్పొరేషన్లో ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు