ఐటిఐ అభ్యర్థులకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళ

వివరాలు తెలిపిన ఐటిఐ నోడల్ ఆఫీసర్ జి రమేష్

On

భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా) సెప్టెంబర్ 3: 09-09-2024 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ల అభ్యర్థులు  భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పరిదిలోగల వివిద పరిశ్రమలలో అప్పెంటిషిప్ ట్రైనింగ్ చేయుట కొరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళ నిర్వహించుటకు నిర్వహించారు. ఇందు నిమిత్తము ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ముందుగా www.apprenticeshipindia.org.in నందు వారి పేరు నమోదు చేసుకొని అట్టి నకలు కాపీని, ఒక బైయో డేటా ఫామ్ ను మరియు తమ సంబందిత విద్యార్హత ధృవీకరణ పత్రాలు కూడా జత చేసి అప్రెంటిషిప్ మేలా కు హాజరు కావలసినదిగా కోరడమైనది.భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ ప్రధానాచార్యులు, పరిశ్రమల యాజమాన్యాల వారు తమ పరిదిలోని అప్రెంటిషిప్ ఖాళీల వివరాలతో ది. 09-09-2024 నాడు ఉదయం 10.00 గంటలకు ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం నందు హాజరు అవుతారు.కావున భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా లోని ఐ.టి.ఐ పాస్ అయిన అన్ని ట్రేడ్ ల అబ్యర్ధులు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనవలసినదిగా ప్రభుత్వ ఐ.టి.ఐ. కొత్తగూడెం ప్రదాణాచార్యులు మరియు భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా లోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐ.టి.ఐ నోడల్ ఆఫీసర్ జి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Views: 109
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత