చికిత్స పొందుతున్న కవితను పరామర్శించిన రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు.

వాల్మీకి బోయ కవితకు న్యాయం చేసేంతవరకు పోరాడుతాం....!

On
చికిత్స పొందుతున్న కవితను పరామర్శించిన రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు.

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 2 :- పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్న తుంబళం గ్రామంలో ఇటీవల జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోయ కవిత ను బుధువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ బోయ నాయుడు అనే యువకుడు పొట్ట కూటి కోసం తనవంతుగా ఆటో నడుపుకుని జీవనం సాగిస్తూ తన కుటంబాన్ని పోషించుకుంటూనే బతుకుతున్న నాయుడు మీద నాయుడు అక్క బోయ కవిత మీద గంగాధర్, వీరేష్ మరియు మరికొందరు వ్యక్తులు తప్పతాగి విచక్షణా రహితంగా చితకబాధి మహిళా అనికూడా చూడకుండా దాడిచేసి కడుపుమీద,వంటిమీద కొడుతూ చేయిని విరగొట్టడం జరిగిందన్నారు. బోయ నాయుడు కుటుంబ సభ్యులపై దుర్భాషలాడిన వారిని విడిచి ఎస్సై నిరంజన్ రెడ్డి తిరిగి బోయ కవిత మరియు వారి కుటుంబ సభ్యుల మీదనే కేసుపెట్టడం సబబు కాదని, ఈ సంఘటనను గురించి కర్నూలు జిల్లా ఎస్పి గారికి తెలియపరుస్తామన్నారు. వెంటనే బాధిత బోయ కవిత కుటుంబ సబ్యులందరికి న్యాయం చేయాలనీ కోరుతూ లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరుపున భారీ సంఖ్యతో జిల్లా స్థాయిలో ధర్నా చేపడతామని డిఎస్పి మరియు ఎస్పి గారికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, మండల కార్యదర్శి వీరాంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి, పెద్ద కడబూరు మండల కార్యదర్శి చిన్న నరసప్ప, వాల్మీకి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 130
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్