చికిత్స పొందుతున్న కవితను పరామర్శించిన రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు.

వాల్మీకి బోయ కవితకు న్యాయం చేసేంతవరకు పోరాడుతాం....!

On
చికిత్స పొందుతున్న కవితను పరామర్శించిన రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు.

న్యూస్ ఇండియా/పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 2 :- పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్న తుంబళం గ్రామంలో ఇటీవల జరిగిన ఇరు వర్గాల ఘర్షణలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బోయ కవిత ను బుధువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నాయకులు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ బోయ నాయుడు అనే యువకుడు పొట్ట కూటి కోసం తనవంతుగా ఆటో నడుపుకుని జీవనం సాగిస్తూ తన కుటంబాన్ని పోషించుకుంటూనే బతుకుతున్న నాయుడు మీద నాయుడు అక్క బోయ కవిత మీద గంగాధర్, వీరేష్ మరియు మరికొందరు వ్యక్తులు తప్పతాగి విచక్షణా రహితంగా చితకబాధి మహిళా అనికూడా చూడకుండా దాడిచేసి కడుపుమీద,వంటిమీద కొడుతూ చేయిని విరగొట్టడం జరిగిందన్నారు. బోయ నాయుడు కుటుంబ సభ్యులపై దుర్భాషలాడిన వారిని విడిచి ఎస్సై నిరంజన్ రెడ్డి తిరిగి బోయ కవిత మరియు వారి కుటుంబ సభ్యుల మీదనే కేసుపెట్టడం సబబు కాదని, ఈ సంఘటనను గురించి కర్నూలు జిల్లా ఎస్పి గారికి తెలియపరుస్తామన్నారు. వెంటనే బాధిత బోయ కవిత కుటుంబ సబ్యులందరికి న్యాయం చేయాలనీ కోరుతూ లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరుపున భారీ సంఖ్యతో జిల్లా స్థాయిలో ధర్నా చేపడతామని డిఎస్పి మరియు ఎస్పి గారికి తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, మండల కార్యదర్శి వీరాంజనేయులు, పట్టణ ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి, పెద్ద కడబూరు మండల కార్యదర్శి చిన్న నరసప్ప, వాల్మీకి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Views: 129
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం మత్తులో దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ఇప్పటికే సూచించాం, ప్రజల భద్రత మా ప్రథమ కర్తవ్యము. ఇటువంటి...
డాక్టరేట్ రావడంతో బాధ్యత మరింత పెరిగింది : వాసవి కళాశాల ప్రిన్సిపాల్ డా. మాదారం విక్రమ్ గౌడ్..
పోలీస్ స్టేషన్ గోడ దూకి పారిపోతున ఎస్సై నీ వెంబడించి పట్టుకున్న ఏసీబీ అధికారులు
కన్నుల పండువగా ఆకుతోట ఆదినారాయణ కుమారుడి రిసెప్షన్ వేడుక
రాజ్ మహమ్మద్ జాన్భీ ట్రస్ట్ ఉచిత కంటి వైద్య శిబిరం
సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..