దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
ఇదేమి దుమ్ము బాబోయ్
By Ramesh
On
న్యూస్ ఇండియా తెలుగు, అక్టోబర్ 20 (బచ్చన్నపేట మండల రిపోర్టర్ జేరిపోతుల రమేష్)
జనగాం జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో పాత బస్టాండ్ నుండి గ్రామ పంచాయతీ వరకు నిత్యం మండల ప్రజలు కాలినడకన, వాహనాల లో ప్రయాణం చేస్తారు. ప్రతి రోజు విపరీత మైనా దుమ్ము దూళి ప్రయాణికుల మీద వారి కళ్ళలో పడుతుంది.ఇదేమి దుమ్ము బాబోయ్ అంటూ వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు.నిత్యం రోడ్ మీద ఉన్న తినుబండారలలో హోటల్ లలో షాప్ లలో నిత్యం విపరీతంగా దుమ్ము ద్వారా ఆరోగ్యం క్షినిస్తుంది. తరుచు హాస్పిటల్ లో వేల రూపాయల ఖర్చు అవుతుంది. కేవలం ఓట్లకోసం మాత్రమే వచ్చే రాజకీయ నాయకలు ఓట్లు అవ్వగానే మర్చిపోతున్నారు.ఇప్పటికి అయినా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్ పై దుమ్ము రాకుండా శాశ్వత పరిష్కారం చెయ్యాలని బచ్చన్నపేట మండల గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Views: 352
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
18 Nov 2025 22:19:33
రిపోర్టర్ జైపాల్

Comment List