118 కేజీల గంజాయి పట్టివేత

రెండు ఆటోలు స్వాధీనం

On
 118 కేజీల గంజాయి పట్టివేత

ఇద్దరు వ్యక్తుల అరెస్టు ..పరారీలో ఒకరు

భద్రాచలం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్) అక్టోబర్ 30: ఒరిస్సా కలిమెళ్ళ నుంచి హైదరాబాద్ కు రెండు ఆటోలో గంజాయి వెళుతుందని సమాచారం మేరకు, ఎక్సైజ్  ఎన్ఫోర్స్మెంట్ మరియుఎక్సైజ్ పోలీసులు కలిసి భద్రాచలం ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానంగా వచ్చినటువంటి  రెండు ఆటోలు తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయి 118 కేజీలుగా ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. గంజాయి తో పాటు రెండు ఆటో లను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. పట్టుకున్న గంజాయి, వాహనాల విలువ కలిపి  రూ. 31.50 లక్షలు గా ఉంటుందని ఎక్సైజ్ సూపర్డెంట్ కరమ్ చందు తెలిపారు. అరెస్టు కాబడిన వ్యక్తుల్లో హైదరాబాద్ కు చెందిన కనిగల స్వాతిక్, మణుగూరు కు చెందిన గుంజు ఆమోస్ ను అరెస్టు చేయగా,సపావత్ వెంకన్న పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. తనిఖీల్లో ఎస్.ఐ గౌతమ్ సిబ్బంది రామకృష్ణ గౌడ్, హాబీబ్ పాషా, వెంకట నారాయణ, గురవయ్య, సుమంత్, శ్రావణి, రమేష్ పాల్గొన్నారు.గంజాయిని పట్టుకున్నటువంటి  టీమును ఎక్సైజ్  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్  విబి కమలాసన్ రెడ్డి, ఎక్సైజ్ సూపర్డెంట్  జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఎక్సైజ్ సూపర్డెంట్ జానయ్య అభినందించారు.

Views: 139
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం..
ఏపీ ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టించిన పెద్ద అంబర్‌పేట్ అసోసియేషన్, ఆటోనగర్ జేఏసీ.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఆగస్టు 6, న్యూస్ ఇండియా...
ప్రీ ఎయిమ్ కిడ్స్ స్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు
అమరవీరులు దస్తాగిరి, రాంచందర్ త్యాగం చిరస్మరణం   
విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి
సోమారం గ్రామంలో విద్యుత్ షాక్‌తో 7 గోర్లు మృతి.. రైతుకు రూ. లక్ష నష్టం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం
తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద డీసీఎం బోల్తా... ఆపిల్ పండ్ల కోసం ఎగబడిన జనం