ప్రియురాలిని అత్యంత కిరాతకంగా చంపిన ప్రియుడు
జూలూరుపాడు మండలం మాచినపేట వద్ద సంఘటన
.jpg)
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పి రెహమాన్
జూలూరుపాడు(న్యూస్ఇండియానరేష్) నవంబర్ 13:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని మాచినపేట తండాలో దారుణం జరిగింది ప్రియురాలు స్వాతిని అత్యంత కిరాతకంగా చంపిన ప్రియుడు వీరభద్రం తన పొలంలో పూడ్చిపెట్టిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం గ్రామస్తుల నోట బయటికి రావడంతో వీరభద్రాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. స్వాతిని హత్య చేయటానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ ఘటనా పరిశీలించారు. స్వాతిని గత మూడు రోజుల క్రితమే హత్య చేసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. సింగరేణిలో ఉద్యోగం కోసం స్వాతి, వీరభద్రం అనే వ్యక్తులకు పార్వతి-రత్నకుమార్ దంపతులు రూ.16 లక్షలు ఇచ్చారు. ఉద్యోగం రాకపోవడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రూ.16 లక్షలపై ఆశపడి స్వాతిని వీరభద్రం చంపి
పొలంలో పూడుచి పెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ మృతదేహాన్ని స్వాతిగా పోలీసులు గుర్తించారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List