ముగ్గురిని వరించిన పదవులు
దిశా కమిటీ సభ్యులుగా ఇద్దరు
సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబర్ గా ఒకరు
కొత్తగూడెం (న్యూస్ఇండియానరేష్) నవంబరు 17: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ముగ్గురికి పదవులు వరించాయి . దిశ కమిటీ మెంబర్స్ గా డాక్టర్ వందనపు స్వప్న, ఎ.ఆనందరావు. సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డ్ మెంబర్ గా వై శ్రీనివాస్ రెడ్డి నియమితులైనట్లుగా ఆదివారం కొత్తగూడెం విద్యానగర్లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటు పడతామని అన్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List