ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్న హరిబాబు

హరిబాబు ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయం: సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

On
ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్న హరిబాబు

IMG-20241125-WA0993కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) నవంబర్ 25: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా లో జరిగిన స్వేరో ఏడవ జాతీయ కన్వెన్షన్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్నారు సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హరి బాబుకు ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలైన ఎదుర్కొని వెనకడుగు వేయకుండా హరిబాబు అంచలంచెలుగా ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయం అన్నారు హరిబాబు తన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదుగుతూ నలుగురికి ఉపాధిని చూపిస్తూ నేడు మేము ఎవరికీ తక్కువ కాదు అని నిజం చేశారు ఒక స్వేరోగా హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి నేడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నర్సింగ్ కళాశాలకు అనుమతిని తీసుకొచ్చి తన సొంత ఊరైన పాల్వంచలో నర్సింగ్ కళాశాల ప్రారంభించడం సంతోషిదాయకమని కొనియాడారు. హరిబాబు మాట్లాడుతూ మొక్కవోని ధైర్యం వెనకడుగు వేయని పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో మనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. నేడు ఉత్తమ వ్యాపారవేత్తగా చాలా ఆనందంగా ఉందని నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ తమ విలువైన సలహాలు సూచనలు అందిస్తూ సహకరించిన సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాకు ఆదర్శంగా నిలిచారని అన్నారు ఈ అవార్డు అందుకోవడానికి సహకరించిన నా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 41
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి