ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్న హరిబాబు

హరిబాబు ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయం: సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

On
ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్న హరిబాబు

IMG-20241125-WA0993కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) నవంబర్ 25: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా లో జరిగిన స్వేరో ఏడవ జాతీయ కన్వెన్షన్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన ఏరో సంస్థల అధినేత తాళ్లూరి హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకున్నారు సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హరి బాబుకు ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ని అవాంతరాలైన ఎదుర్కొని వెనకడుగు వేయకుండా హరిబాబు అంచలంచెలుగా ఎదిగిన తీరు నేటి యువతకు ఆదర్శప్రాయం అన్నారు హరిబాబు తన తెలివితేటలతో అంచలంచెలుగా ఎదుగుతూ నలుగురికి ఉపాధిని చూపిస్తూ నేడు మేము ఎవరికీ తక్కువ కాదు అని నిజం చేశారు ఒక స్వేరోగా హరిబాబు ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు అందుకోవడం మనందరికీ గర్వకారణం అన్నారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తో తన వ్యాపారాన్ని ప్రారంభించి నేడు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నర్సింగ్ కళాశాలకు అనుమతిని తీసుకొచ్చి తన సొంత ఊరైన పాల్వంచలో నర్సింగ్ కళాశాల ప్రారంభించడం సంతోషిదాయకమని కొనియాడారు. హరిబాబు మాట్లాడుతూ మొక్కవోని ధైర్యం వెనకడుగు వేయని పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో మనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. నేడు ఉత్తమ వ్యాపారవేత్తగా చాలా ఆనందంగా ఉందని నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూ తమ విలువైన సలహాలు సూచనలు అందిస్తూ సహకరించిన సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాకు ఆదర్శంగా నిలిచారని అన్నారు ఈ అవార్డు అందుకోవడానికి సహకరించిన నా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 29
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు  తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు 
తాడిచెట్టు పై నుండి జారీన గీత కార్మికుడు   న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక  కొడకండ్ల రిపోర్టు గుర్రం ప్రభాకర్   జనగాం జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో...
కార్పొరేషన్ టెండర్లలో గందరగోళం 
గ్రామాభివృద్ధియే తమ ధ్యేయం అంటున్న సర్పంచ్
అభివృద్ధి పనుల్లో దూసుకెళ్తున్న పంగిడి గ్రామం
వేల్పూగొండ గ్రామం బోల్లికుంటలో పులి సంచారం
కొత్తగూడెం  హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో అమ్మ పేరు మీద ఒక మొక్క