కల్లుగీత కార్మిక సంఘ సదస్సులో పాల్గొన్న బబ్బూరి శ్రీకాంత్ గౌడ్
శ్రీకాంత్ గౌడ్ ను సత్కరించిన కేజికేఎస్ రాష్ట్ర నాయకత్వం
కేజికేఎస్ రాష్ట్ర నాయకత్వం
జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్లో కల్లుగీత కార్మిక సంఘం 67 వ వార్షికోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ హాజరై మాట్లాడుతూ కల్లుగీత సంఘం 67 వార్షికోత్సవం జరుపుకోవడం శుభపరిణామం అని సంఘం నాయకులు అంతా ఒకే తాటిపై ఉండి కార్మికుల హక్కుల కోసం పోరాడాలని సూచించారు.కార్మికుల హక్కుల కోసం సంఘ అభ్యున్నతికి కృషి చేస్తున్న సంఘ నాయకులను శ్రీకాంత్ గౌడ్ అభినందించారు.ఈ సందర్భంగా బబ్బురి శ్రీకాంత్ గౌడ్ ను కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకత్వం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కేజీకేఎస్ రాష్ట్ర జిల్లా మండల నాయకులు గీత కార్మికులు పాల్గొన్నారు.
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.

Comment List