కళ్యాణ లక్ష్మి ,సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన కూనంనేని 

65 లక్షల విలువ గల చెక్కుల పంపిణీ

On
కళ్యాణ లక్ష్మి ,సీఎంరిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన కూనంనేని 

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఆర్డీవో ,ఎంఆర్ఓలు

IMG20241206123730కొత్తగూడెం (న్యూస్ ఇండియా నరేష్) డిసెంబర్ 6:కొత్తగూడెం నియోజవర్గం పరిధిలోని కొత్తగూడెం, చుంచుపల్లి , లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్  పరిధిలోని కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి  215 చెక్కులను ఎమ్మెల్యే కూనంనేను సాంబశివరావు శుక్రవారం పంపిణీ చేశారు. మండలాలవారీగా లక్ష్మీదేవిపల్లి(37) చుంచుపల్లి (32)కొత్తగూడెం(65) సుజాతనగర్(81) మొత్తం 65 లక్షల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అంగన్వాడి ఆధ్వర్యంలో తయారు చేసిన బట్టలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రారంభించి, చిన్నారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామాలక్ష్మి, ఎమ్మార్వోలు పుల్లయ్య, వరప్రసాద్ , కృష్ణ, శిరీష ,మున్సిపల్ కమిషనర్ శేషoజనే స్వామి, కొత్తగూడెం సొసైటీ అధ్యక్షులు మండే వీర హనుమంతరావు, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కంచర్ల జమలయ్య, సిపిఐ నాయకులు చంద్రగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Views: 127
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News