పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్...
పెట్రోల్ ను విడిగా బాటిళ్ళ లో అమ్మడం నేరం...
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్ మాచన రఘునందన్...
రంగారెడ్డి జిల్లా, మార్చి 04, (న్యూస్ ఇండియా ప్రతినిధి):- పెట్రోల్ ను విడిగా బాటిళ్ళలో అమ్మటం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహ

సీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. మంగళవారం మాల్ లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ ను లూజ్ గా అమ్మడం వల్ల నాణ్యత ను ప్రశ్నిoచలేమని రఘునందన్ అన్నారు. పేలుడు పదార్థాల కేటగిరి లోకి వచ్చే పెట్రోల్ ను అధీకృత డీలర్లు తగిన భద్రతా ప్రమాణాల మధ్య మాత్రమే బంకుల్లో అమ్మాలన్న నియమ నిబంధనలు ఉన్నాయన్నారు. అంతేగాక పెట్రోల్ ను విడిగా బాటిళ్ల లో అమ్మడం వల్ల పలు అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని రఘునందన్ అన్నారు. ఆయా ప్రాంతాల్లో పెట్రోల్ ను విడిగా (లూజ్ సేల్స్) అమ్మే వాళ్ళపై బంకు యాజమాన్యాలు ఫిర్యాదు చేస్తే చట్ట ప్రకారం తగు చర్యలు చేపట్టే అవకాశం ఉందని రఘునందన్ హెచ్చరించారు.
Comment List